Cyber Den: కాల్ సెంటర్ ముగుసుగులో భారీగా ఆర్థికమోసాలు.. అమెజాన్ కస్టమర్లే లక్ష్యంగా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Den: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో సైబర్ నేరాల కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారీ ముఠా పై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. భోగాపురంలోని కొన్ని అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా గత రెండేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడైంది. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా ప్రధానంగా అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయల మోసాలకు తెగబడింది. ఈ ముఠా తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల నుండి యువతీ యువకులను తీసుకువచ్చి వారిని ఈ కార్యకలాపాల్లో భాగస్వాములను చేసింది. వారిని ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ఫోన్ ద్వారా విదేశీ కస్టమర్లతో సంభాషణ చేయిస్తూ అకర్మలకు పాల్పడింది. అనకాపల్లి జిల్లా పోలీసులు ఈ నెలలో జరిగిన దాడిలో 100 మందికిపైగా యువతను గుర్తించి, వారిలో 30 మందిని అరెస్ట్ చేశారు.
Read Also: Bride Calls Off Wedding: తాళి కట్టే సమయంలో ఝలక్ ఇచ్చిన పెళ్లికూతురు.. చివరకు లవర్తో..!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఈ సైబర్ డెన్పై దృష్టి సారించేందుకు ఒక సాధారణ వ్యక్తి చేసిన ఫోన్ కాల్ తోనే కీలక సమాచారం బయటపడింది. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిగాయి. సోదాల్లో భారీగా కంప్యూటర్లు, కమ్యూనికేషన్ పరికరాలు, డేటా స్టోరేజ్ డివైస్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో వెలుగు చూసిన మోసాల విలువ సుమారుగా రూ.600 కోట్లకు పైగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇదంతా విస్తృతంగా జరుగుతున్న ఆర్థిక నేరంగా పరిగణిస్తూ కేసును CIDకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. దీనితో DSP స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. CID అధికారులు ఈ ముఠా కార్యకలాపాలను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.
Read Also: S**X On Road: బరితెగించిన రాజకీయ నేత.. రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్ గా శృంగారలీలలు..!
రెండేళ్లుగా ఈ ముఠా సైబర్ డెన్ నడుపుతున్నా ఇప్పటిదాకా ఎలా గుర్తించలేకపోయారన్నది కీలక ప్రశ్నగా మారింది. భోగాపురంలో ఓ సాధారణ అపార్టుమెంట్లో ఇంటర్నేషనల్ స్థాయిలో మోసాలు సాగుతుండటమే గాక, ప్రతి నెలా 15 నుంచి 20 కోట్ల వరకు మోసగిస్తున్నారు. దీనికి కీలక సూత్రధారులు ఎవరు? ఎవరెవరు దీన్ని నడిపిస్తున్నారు? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది. ఈ ఉదంతం మరోసారి సైబర్ సెక్యూరిటీపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటుతోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!