Maharashtra Polls: ముంబైలో పోస్టర్లు కలకలం.. నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు
- ముంబైలో పోస్టర్లు కలకలం
- నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పోస్టర్ల వ్యవహారం ఎన్డీఏ కూటమిలో రాకరేపతున్నాయి. డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్కు సంబంధించిన పోస్టర్లు ముంబైలో కలకలం రేపుతున్నాయి. ముంబై బీజేపీ కార్యాలయం దగ్గర నవంబర్ 23న దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. ‘‘నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్’’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ పోస్టర్లు చర్చకు దారి తీశాయి.
ఇది కూడా చదవండి: Spain Floods: భారీ వరదలతో స్పెయిన్ అతలాకుతలం.. 100 మంది మృతి!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో శివసేన, ఎన్సీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు సంబంధించిన ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మూడు పార్టీలు సీట్లు పంచుకుని ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. అయితే తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా తేల్చలేదు. ఫలితాలు తర్వాత అధిష్టానం డిసైడ్ చేస్తుందని నేతలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ముంబై బీజేపీ ఆఫీస్ దగ్గర మాత్రం ఫడ్నవిస్ నవంబర్ 23న ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. తాజాగా ఎన్డీఏ కూటమిలో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
ఇది కూడా చదవండి: Vikarabad: దారుణం.. మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. పోటాపోటీగా రెండు కూటమిలు తలపడుతున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ మరోసారి అధికారం కోసం ప్రయత్ని్స్తుండగా.. ప్రతిపక్షం అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. మరి ప్రజలు ఎటు వైపు ఉన్నారన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
ఇది కూడా చదవండి: Nimmala Rama Naidu: జగన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..