Vaccination: 5-15 ఏళ్ల పిల్లలకు అప్పుడే.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15 ఏళ్లు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది.. ఇక, 15 ఏళ్లు లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.. ఈ సారి 5 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నారు.. అయితే, దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ… కోవిడ్ టీకాలపై నిపుణుల బృందం సిఫారసు చేసిన వెంటనే వ్యాక్సిన్లు వేస్తామని తెలిపారు.. దీనిపై ఇప్పటి వరకు ఎక్స్పర్ట్ కమిటీ ఎలాంటి సిఫారసు చేయలేదని వెల్లడించారు.. సాధారణ బడ్జెట్పై బీజేపీ.. గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన ఓ కార్యాకమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ఏజ్ గ్రూప్కు టీకాలు ఎప్పుడు వేయాలో శాస్త్రవేత్తల బృందం సిఫారసుల ఆధారంగానే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also: Jagga Reddy: సీఎంకి ఎంత మంది తండ్రులని మేం అడగాలా..?
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయడంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మన్సుఖ్ మాండవీయ.. ఈ వర్గానికి చెందిన టీకాపై నిపుణుల బృందం ఇప్పటి వరకు ఎలాంటి సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు.. కాగా, దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయడం గత నెలలో ప్రారంభమైన విషయం తెలిసిందే.. టీకాలు వేయడం సమస్య కాదు.. మా దగ్గర సరిపడా వ్యాక్సిన్లు ఉన్నాయి, డోస్ల కొరత లేదు.. కానీ, మేం ఖచ్చితంగా సైంటిఫిక్ కమ్యూనిటీ యొక్క సిఫార్సును అనుసరిస్తామని తెలిపారు మాండవీయ.. ప్రభుత్వానికి ఇంతవరకు ఎలాంటి సిఫారసు రాలేదని, దాని ఆధారంగానే రానున్న రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది రాజకీయ నిర్ణయం కాదు.. గత ఏడాది జూలై-ఆగస్టులో సెరో సర్వే మరియు సెరో ప్రాబల్య సర్వేలో 67 శాతం మంది పిల్లలు కూడా యాంటీ బాడీలను అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. అంతిమంగా, శాస్త్రవేత్తలు సిఫార్సులు చేసే ముందు అధ్యయనం చేస్తారు. ఇంతకుముందు ప్రపంచ దేశాలను అనుసరించేవాళ్లం.. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు వారి స్వంత విశ్లేషణను నిర్వహిస్తారు. వారి స్వంత అధ్యయనం కలిగి ఉన్నారని.. వాటి ఆధారంగా అభిప్రాయాలను రూపొందించారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!