NTV Telugu Site icon

Mahalakshmi Murder: మహాలక్ష్మీని 59 ముక్కలు ఎందుకు చేశాడో చెప్పిన ముక్తి రంజన్ తల్లి..

Mahalaxmi

Mahalaxmi

Mahalakshmi Murder: బెంగళూరు మహాలక్ష్మి కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ ఆత్మహత్య తర్వాత మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజన్ ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లికి ఈ సంఘటన గురించి మొత్తం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఒక వార్తాపత్రికతో ముక్తి రంజన్ తల్లి మాట్లాడుతూ.. రంజన్ మంగళవారం నాడు రాత్రి 10 గంటల సమయంలో కంగారుగా ఇంటికి వచ్చినట్లు తెలిపింది. ఎందుకు అలా కంగారు పడుతున్నావ్ అని అడగ్గా.. బెంగళూరులో ఓ మహిళను హత్య చేసినట్లు చెప్పాడని ఆమె పేర్కొనింది. దీంతో ఎందుకు చేశావాని ఆరా తీయగా.. బాధితురాలు తన నుంచి డబ్బు, బంగారు గొలుసు తీసుకున్నట్లు చెప్పాడని తెలిపింది. అలాగే, కొంత మందితో కలిసి నన్ను బెరించిందని ముక్తి రంజన్ ప్రతాప్ చెప్పాడని ఆమె వెల్లడించింది.

Read Also: VG Venkata Reddy Arrested: ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్..

ఇక, 15 రోజుల క్రితమే ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ మహాలక్ష్మీ ఇంటికి వెళ్లాడని అతడి తల్లి తెలిపింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటా.. కోపంలో ఆమెను గొంతుకోసి చంపేశాడని నాతో చెప్పినట్లు ఆ వృద్ధ మహిళ పేర్కొనింది. ఈ విషయం తెలియగానే.. షాక్ అయ్యాను అన్నారు. కానీ, బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచిన ముక్త రంజన్.. పోలీసుల విచారణ వల్ల మా కుటుంబానికి ఏం జరగొద్దనే ఉద్దేశంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను అని చెప్పిన కాసేపటికే సూసైడ్ చెసుకున్నాడని తెలిసిందని ఆమె కన్నీరు పెట్టుకుంది.

Read Also: Pakistan : తన బిడ్డను వెనక్కి ఇవ్వాలని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్తాన్ బ్రిటీష్ పౌరుడు

కాగా, ముక్త రంజన్ బుధవారం నాడు ఒడిశాలోని తన స్వగ్రామంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్న దగ్గర లభించిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో మహాలక్ష్మీ పెళ్లికి అంగీకరించినప్పటికి మరో వ్యక్తితో శారీరకంగా కలిసినట్లు రాసుకొచ్చాడు. అలాగే, నా దగ్గర నుంచి డబ్బు, బంగారం కోసం అనేక సార్లు వేధింపులకు గురి చేసిందన్నాడు. వాటిని సహించలేకపోయా.. అందుకే ఆమెను చంపేసి 59 ముక్కలుగా నరికి ఫ్రీజ్ లో పెట్టేశానని ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ తన డైరీలో ప్రస్తావించాడు.