Ajit Doval: అజిత్ దోవల్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఎందుకు వాడరు.?
- మొబైల్, ఇంటర్నెట్ వాడని అజిత్ దోవల్..
- ఓ కార్యక్రమంలో దోవల్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: భారత జాతీయ భద్రత సలహాదారు(NSA) అజిద్ దోవల్ తన రోజూవారీ పనుల్లో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించనని వెల్లడించారు. ‘‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక యువకుడు.. ‘‘మీరు నిజంగా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడరా?’’ అని దోవల్ను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘‘నేను ఇంటర్నెట్ వాడను, మొబైల్ ఫోన్ కూడా చాలా అరుదుగా మాత్రమే ఉపయోగిస్తాను. కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సినప్పుడు లేదా విదేశాల్లో ఉన్న వ్యక్తులతో అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ వాడుతాను’’ అని చెప్పారు.
Read Also: Iran Protests: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ఇజ్రాయిల్ హైఅలర్ట్..
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
తన పని నిర్వహణకు సంబంధించి ఇతర భద్రమైన కమ్యూనికేషన్ మార్గాలు ఉన్నాయని, అవి సాధారణ ప్రజలకు తెలియవని దోవల్ చెప్పారు. జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాల్లో డిజిటల్ పరికరాల ఉపయోగం ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో దోవల్ వీటికి దూరంగా ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి దోవల్. కేరళ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దశాబ్ధాల నుంచి గూఢచార, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక కార్యక్రమాల్లో పనిచేశారు.
1945లో ఉత్తరాఖండ్లో జన్మించిన దోవల్ 1968లో ఐపీఎస్ అధికారిగా చేరారు. ఆయన ధైరసాహసాలకు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును చిన్న వయసులో అందుకున్న పోలీస్ అధికారిగా రికార్డ్ క్రియేట్ చేశారు. దోవల్ తన కెరీర్లో మిజోరాం, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటు కార్యక్రమాలను అణిచివేయడంలో పనిచేశారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో కీలక పాత్ర పోషించారు. డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనాతో కఠినంగా వ్యవహరించారు. ఇదే కాకుండా 1999లో ఐసీ-814 విమానం హైజాక్ సమయంలో భారత ప్రభుత్వం తరుపున ఉగ్రవాదులతో చర్చలు జరిగే బృందంలో దోవల్ ఉన్నారు.
తాజావార్తలు
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..