ప్రధాని సొంత రాష్ట్ర సీఎంపై బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందనగా, హఠాత్తుగా ముఖ్యమంత్రి విజయ్ రూపానిని రాజీనామా చేయమని బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆదేశించడం రాజకీయ వ్యూహమే అంటున్నారు. గతంలో, 2016 లో కూడా, 16 నెలలు ముందుగా ముఖ్యమంత్రి గా ఆనందిబెన్ పటేల్ ను రాజీనామా చేయాలని ఆదేశించింది అధికార బీజేపీ అగ్రనాయకత్వం. గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న, శక్తివంతమైన పటేల్ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశమే బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తుత నిర్ణయానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని “జైన్” మతానికి చెందిన వారు. దీంతో, తదుపరి ముఖ్యమంత్రిగా గుజరాత్ కు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల పేర్లను పరిశీలిస్తుంది బీజేపీ కేంద్ర అగ్ర నాయకత్వం. కేంద్ర మత్స్య, డైరీ, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ ఇద్దరూ పటేల్ వర్గానికి చెందినవారే. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఆర్.సి. ఫాల్దు పటేల్ సమాజిక వర్గానికి చెందిన వీరిద్దరి పేర్లు కూడా ముఖ్యమంత్రి పదవికి పరిశీలనలో ఉన్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. వీరి పేర్లే గాకుండా, కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, దాద్రా-నగర్ హవేలి మరియు డామన్-డయూ ల పాలనాధికారి ప్రఫుల్ ఖోడా పటేల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచరం.
Also Read
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
అయితే ఇటీవల లక్షద్వీప్ లో నియమ నిబంధనలను మార్చడంతో, పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కుని వార్తల్లోకి ఎక్కారు ప్రఫుల్ ఖోడా పటేల్. ప్రాణాంతక “కోవిడ్” నిర్వహణ లో కూడా పూర్తి వైఫల్యం చెందారని విజయ్ రూపాని పట్ల సర్వత్రా విమర్శలు వచ్చాయి. విజయ్ రూపాని తర్వాత, తదుపరి ముఖ్యమంత్రి “పాటీదార్” మాత్రమే కావాలన్న డిమాండ్లను ఇటీవల మరింత ఉధృతం చేసారు పటేల్ సమాజిక వర్గ నేతలు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో, “ఆమ్ ఆద్మీ పార్టీ” లాంటి ప్రతిపక్షాలు గుజరాత్ లో క్షేత్ర స్థాయిలో బలం పుంజుకోవడంతో, పటేల్ సమాజిక వర్గం అభిమతాన్ని గౌరవించాలన్నదే బీజేపీ అగ్రనాయకత్వ రాజకీయ వ్యూహం అని తెలుస్తుంది.
ఈ విషయం పై గుజరాత్ బీజేపీ వ్యవహరాల ఇంచార్జ్ భూపేంద్ర యాదవ్, బీజేపీ జనరల్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్, ఇరువురు కేంద్ర మంత్రులు మనసుఖ్ మాండవీయ, పురుషోత్తమ్ రూపాలా ముందుగానే సమావేశమయ్యారు. ఆ తర్వాత, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని విజయ్ రూపాని కి తెలియజేసారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా. దాంతో కొత్త నాయకత్వంలో, ప్రధాని మోడి మార్గదర్శనంలో గుజరాత్ రాష్ట అభివృధ్ది కొనసాగాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు విజయ్ రూపాని. అయితే గుజరాత్ లో అధికార బీజేపీ శ్రేణుల నుంచి తీవ్ర అసంతృప్తి ని ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి విజయ్ రూపాని.
తాజావార్తలు
-
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!