Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Behind Increased Terror Attacks In Jammu Experts Speak

Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల ఉద్దేశ్యం ఏమిటి..?

Published Date :June 14, 2024 , 8:47 am
By Venu Goapl Reddy
  • జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రదాడులు..
  • మోడీ ప్రమాణస్వీకారం నుంచే దాడులు మొదలు..
  • పరిస్థితులు సరిగా లేవని చెప్పేందుకే ఉగ్రదాడులు..
  • మరోసారి మోడీ అధికారంలోకి రావడంతో రగిలిపోతున్న పాక్..
Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల ఉద్దేశ్యం ఏమిటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Terrorist Attacks: జమ్మూ కాశ్మీర్‌లో వరసగా జరుగుతున్న ఉగ్రవాద ఘటనలు ఆ రాష్ట్రంలో మరోసారి భయాందోళనల్ని పెంచాయి. గత ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే, ఉగ్రవాదులు రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత వరసగా కథువా, దోడా ప్రాంతాల్లో మూడు ఉగ్రవాద ఘటనలు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చగా.. ఒక జవాన్ అమరుడయ్యారు.

అయితే, ఇటీవల కాలంలో పీర్ పంజాల్ పరిధి దిగువన ఉన్న జమ్మూలో ఉగ్రవాద ఘటనలు గణనీయంగా పెరిగాయి. రిటైర్డ్ ఆర్మీ అధికారుల ప్రకారం.. ప్రధానిమోడీ, ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతున్న సమయంలో, మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని చక్కదిద్దలేదనే అభిప్రాయాన్ని కలిగించేందుకే బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హుస్నైన్(రిటైర్డ్) అన్నారు. 2000లో జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని చిట్టి సింగ్ పోరా గ్రామంలో ఉగ్రవాదులు 35 మంది సిక్కు యాత్రికులను కాల్చి చంపిన అంశాన్ని ఉదహరించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు ఒక రోజు ముందు ఈ ఘటన జరిగిందని గుర్తు చేశారు.

Read Also: Heavy Rains: చురుగ్గా రుతుపవనాలు కదలిక.. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన..

మోడీ మరోసారి ప్రధానిగా ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోడీ తన ప్రభుత్వ విజయాలను చెబుతున్న సందర్భంలోనే, జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులు బాగా లేవని చూపించాలని శత్రుదేశం పాకిస్తాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఉగ్రవాద దాడుల్ని ప్రోత్సహిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు విజయవంతగా ముగిసిన తర్వాత, మళ్లీ ప్రధాని మోడీ మూడోసారి అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వ్యవహరిస్తోంది. ఆర్మీ ఆపరేషన్ల వల్ల గత కొంత కాలంగా ఉగ్రవాదుల్ని మట్టుబెడుతున్నారు. కాశ్మీరీ యువత టెర్రరిజం నుంచి బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో పోలిస్తే ఉగ్రదాడుల భిన్నంగా జరుగుతున్నాయి. కొన్ని చిన్నచిన్న గ్రూపులు టార్గెటెడ్ కిల్లింగ్స్ చేపడుతున్నాయి. వీరంతా బాగా శిక్షణ తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా ‘‘జింగిల్ వార్‌ఫేర్’’లో ఆరితేరారు. అడవుల్లో రోజుల పాటు మకాం వేసి, గుహల్లో నివసిస్తూ అదును చూసి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దానికి ఆటంకం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jammu kashmir
  • Pakistan
  • Reasi Attack
  • terrorist attacks

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions