BJP In Jammu Kashmir: కాశ్మీర్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు..? అసలు తప్పు ఎక్కడ జరిగింది..?
- జమ్మూ కాశ్మీర్లో హంగ్ అసెంబ్లీ.. ఎగ్జిట్ పోల్స్ అంచనా..
- లోయలో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి.. జమ్మూాలో బీజేపీ..
- కాశ్మీర్ లోయలో ఒక్క సీటు కూడా బీజేపీకి రాదా..?
- అసలు ఎక్కడ తప్పు జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP In Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని అంతం చేసి, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేపట్టాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గతంలో ప్రతీ శుక్రవారం రాళ్లు రువ్వే సంస్కృతికి చరమగీతం పలికింది. అయినా కూడా తాజాగా జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్ లోయ ప్రాంతంలోని ఓటర్లు బీజేపీకి వేటేసేందుకు పెద్దగా ఇష్టం చూపలేదు. ఈ విషయం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనుబట్టి చూస్తే తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ‘నయా కాశ్మీర్’ నినాదం పెద్దగా పనిచేయలేదని తెలుస్తోంది. సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. చూస్తే జమ్మూ కాశ్మీర్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కూటమి 95 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 40-48 స్థానాలు గెలుచుకుంటుందని అంచానా వేసింది.
ఇక్కడ జమ్మూ ప్రాంతంలో మాత్రం బీజేపీ ఘనంగా బలపడుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. జమ్మూలో ఉన్న 43 సీట్లలో బీజేపీ 27-31 స్థానాలు గెలుచుకుంటుందని చెబుతున్నాయి. ఇక కాశ్మీర్ లోయలోని 47 స్థానాల్లో మాత్రం బీజేపీ ఖతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి మాత్రం గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా బలపడకపోయినప్పటికీ, ఎన్సీ సొంత బలంపైనే ఆధారపడింది.
Also Read
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
Read Also: S Jaishankar :జార్జ్ సోరోస్ లేదా కిమ్ జోంగ్ ఉన్తో డిన్నర్.. జైశంకర్ రిఫ్లై అదుర్స్..
అసలు ఎక్కడ తప్పు జరిగింది..?
లోక్సభ ఎన్నికల్లో లోయలోని మూడు పార్లమెంట్ సెగ్మెంట్లకు బీజేపీ పోటీ కూడా చేయలేదు. ఇక్కడే బీజేపీకి సీన్ అర్థమైంది. నిజానికి ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి ఆటంకం అని ఒప్పించడంలో బీజేపీ విఫలమైంది. తమకు ఉన్న హక్కును బీజేపీ తీసేసిందనే భావన లోయలోని ముస్లింలలో పేరుకుపోయింది. దీనికి తోడు ఆర్టికల్ 370 రద్దు సమయంలో చాలా రోజుల పాటు ఈ ప్రాంతంలో ఆంక్షలు విధించడం కూడా ప్రజల్లో కోపాన్ని నింపింది.
దీనికి తోడు ఫరూఖ్ అబ్దుల్లా ఎన్సీ, మెహబూబా ముఫ్తీ పీడీపీ పార్టీలు ఆర్టికల్ 370 రద్దుని తమకు జరిగిన అన్యాయంగా చిత్రీకరించాయి. దీనిని బీజేపీ బలంగా కౌంటర్ చేయలేకపోయింది. తీవ్రవాదం, వేర్పాటువాదం, రాళ్లదాడులు తగ్గినప్పటికీ, ఇక్కడ ప్రజలు తమ మాట్లాడే హక్కును కోల్పోయామనే భావనని కలిగి ఉన్నారు. దీంతోనే లోయపై బీజేపీ పట్టు కోల్పోయింది. కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడి స్థానిక విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని బీజేపీ హామీ ఇచ్చింది. దీంట్లో పెద్దగా పురోగతి లేకుండా పోయింది. ఏదైమైనా జమ్మూ కాశ్మీర్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగినప్పటికీ, లోయలోని ఓటర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే భావన ఎగ్జిట్ పోల్స్లో వ్యక్తమైంది.
తాజావార్తలు
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!