Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. ఎగ్జాట్లీ ఏ సమయంలో జరిగిందంటే..?
- బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం..
- ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి గాయాలు..
- సాయంత్రం 5:16కి అభిమానులు భారీ కేడ్లు దూకడంతో తొక్కిసలాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడగా.. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతుల్లో నలుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు తెలుస్తుంది. స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు దూసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
Read Also: Broccoli Superfood: బ్రోకలీ తినడం వల్ల నిజంగానే బరువు తగ్గవచ్చా..?
Also Read
కాగా, స్టేడియం గేట్ వద్ద ఉన్న పైకప్పు కూలడంతో తొక్కిసలాట స్టార్ట్ అయిందని తెలుస్తుంది. ఒక్కసారిగా అభిమానులు స్టేడియంలోకి దూసుకురావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేక పోయారు. ఈ క్రమంలో లాఠీచార్జ్ చేయగా.. ఈ సందర్భంగా స్టేడియాన్ని ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బాధితులను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పరామర్శించారు.
Read Also: Off The Record: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే సీన్ ఉందా..? అన్ని వట్టి మాటలేనా..?
అయితే, మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలకు ఆర్సీబీ జట్టు బెంగళూరుకు చేరింది. ఇక, సాయంత్రం 4:47 గంటలకు విధాన సభ ప్రాంగణానికి ఆర్సీబీ వెళ్లింది.. 5:10కి భారీ వర్షంలోనే ఆర్సీబీ టీమ్కు సత్కారం కొనసాగింది. 5:16 గంటలకి చిన్నస్వామి స్టేడియం దగ్గర లాఠీచార్జ్ జరిగింది. దీంతో 5:16 నిమిషాలకు అభిమానులు భారీ కేడ్లు దూకడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. 5:30 గంటలకి ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరా తీశారు. 5:47కి స్టేడియం వద్దకు ఆంబులెన్స్ చేరుకున్నాయి. సాయంత్రం 5:50 గంటలకి ఎనిమిది మంది చనిపోయినట్లు ప్రకటన వెల్లడించింది. 5:53 నిమిషాలకు బెంగళూరు పోలీసులు చేతులెత్తేశారు. సాయంత్రం 6:01 గంటలకి 11 మంది చనిపోయినట్లు ప్రకటన విడుదల చేశారు.
తాజావార్తలు
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!