NOTA: ఒక వేళ “నోటా”కు ఎక్కువ ఓట్లు వస్తే ఎలా..? ఈసీకి సుప్రీం నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NOTA: భారతదేశ ఎన్నికల ప్రక్రియాలో ‘నోటా’కి కీలక స్థానం ఉంది. ఎన్నికల్లో తమకు నచ్చని అభ్యర్థి ఉంటే ఓటర్లు నన్ ఆఫ్ ది ఎబో(NOTA)కి ఓటేస్తారు. ఒకవేళ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితి ఏంటనే సందేహం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
రచయిత, మోటివేషనల్ స్పీకర్ శివ్ ఖేరా దీనిపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని 5 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించడేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. నోటాని ‘‘కల్పిత అభ్యర్థి’’గా సరైన, సమర్థవంతమైన ప్రచారాన్ని నిర్ధారించేలా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఖేరా తరుపున సీనియన్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ వాదించారు.
Also Read
Read Also: Sandeshkhali: కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంలో మమత సర్కార్ పిటిషన్
ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో సూరత్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి విజేతగా ప్రకటించిన సందర్భాన్ని న్యాయవాది సుప్రీంకోర్టు ముందు ఉంచారు. ‘‘సూరత్లో ఒకే అభ్యర్థి బరిలో ఉండటంతో ఆయనని ఏకగ్రీవం చేశారు. అయితే ఓటర్లకు నోటా కోసం వెళ్లేందుకు ఎంపిక ఉండాలి కాబట్టి ఎన్నికలు జరగాలి’’అని పిటిషనర్ కోరారు.
ఈవీఎంలో నోటా ఆప్షన్ అనేది ఎన్నికల వ్యవస్థలో ఓటరు అభ్యర్థిని తిరస్కరించే హక్కు అని పిటిషనర్ పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్పై నోటీసు జారీ చేస్తూ, “ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినది కూడా. దీనిపై ఎన్నికల సంఘం ఏమి చెబుతుందో చూద్దాం” అని పేర్కొంది.
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!