Tejasvi Surya: మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ తేజస్వీ సూర్యపై కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejasvi Surya: బెంగళూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. ఈ రోజు జరిగిన పోలింగ్లో మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ బెంగళూర్లోని జయనగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎక్స్ వేదికగా ‘‘మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించే’’ వీడియోను పోస్ట్ చేసినట్లు కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు.
Read Also: Supreme Court: భార్య తెచ్చిన “స్త్రీధనం”పై భర్తకు హక్కు లేదు..
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ఎన్నికల్లో ఓటేసినత తర్వాత తేజస్వీ సూర్య మాట్లాడుతూ.. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 30 సీట్లకు మించి గెలవకపోవచ్చని అన్నారు. కాంగ్రెస్ పూర్తిగా నిరుత్సాహానికి గురైందని, 30 సీట్లకు మించి గెలవలేమని సర్వే తర్వాత సర్వేలు చెబుతున్నాయి… ప్రధాని (నరేంద్ర మోదీ)పై వారు చేస్తున్న వ్యక్తిగత దాడులు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే ప్రధాని మోడీకి, బీజేపీకి మరింత ప్రజాదరణ దక్కుతోంది’’ అని ఆయన అన్నారు.
బెంగళూర్ సౌత్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరుపున తేజస్వీ సూర్య పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ సౌమ్యా రెడ్డిని రంగంలోకి దింపింది. ఈ ఏడాది ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు, యువకులు పెద్ద ఎత్తున ఓటు వేయాలని సూర్య కోరారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలో నేడు 14 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!