BJP: “ఢిల్లీ వెళ్లి ఖాళీ చేతులతో వచ్చాడు”.. ఠాక్రే పర్యటనపై బీజేపీ విమర్శలు..
- ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీ పర్యటనపై బీజేపీ విమర్శలు..
- శివసేనను కాంగ్రెస్ ముందు తలవంచుకునేలా చేశాడు..
- ఢిల్లీ వెళ్లి ఖాళీ చేతులతో వచ్చాడని ఎద్దేవా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకోవడానికి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ నిన్న ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో శివసేన(యూబీటీ)- కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘‘మహా వికాస్ అఘాడీ’’ సంచలన ఫలితాలు సాధించింది. రాష్ట్రంలోని 48 ఎంపీ సీట్లకు గానూ 29 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలను రిపీట్ చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఠాక్రే ఢిల్లీ పర్యటన సాగినట్లు తెలుస్తోంది.
Read Also: Tihar Prison jailer: తీహార్ జైలర్ ఓవరాక్షన్.. బర్త్ డే పార్టీలో తుపాకీతో డ్యాన్స్
Also Read
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
అయితే, ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీ పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఢిల్లీకి వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడని శుక్రవారం విమర్శించింది. ముఖ్యమంత్రి పదవిని మళ్లీ తనకే కేటాయించాలని ఆశించిన ఠాక్రే రిక్తహస్తాలతో తిరిగి రావాల్సి వచ్చిందని బిజెపి రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయే విలేకరులతో అన్నారు. ‘‘ మహారాష్ట్రని మరిచిపోండి, ఠాక్రే తనకు తాను ఏమీ పొందలేకపోయాడు. సీఎం కావాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఢిల్లీకి వెళ్లాడు. కానీ ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు’’ అని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటామని సీనియర్ కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించిన తర్వాత థాకరే నిరాశ చెందారని ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలని మహా వికాస్ అఘాడీగా ఎదుర్కోవాలని కూటమిలోని పార్టీలు ప్రకటించాయి. ఠాక్రే శివసేన(యూబీటీ) ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ముందు పెట్టాడని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. 2019 ఎన్నికల ముందు అమిత్ షా ఠాక్రే నివాసమైన మాతోశ్రీని సందర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో శివసేకు 125 సీట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 100 సీట్లు కావాలన్నా కాంగ్రెస్ ముందు తలవంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?