Bilawal Bhutto: ఆర్టికల్ 370.. దావూద్ ఇబ్రహీం.. భారత్తో సంబంధాలపై పాక్ మంత్రి..
Bilawal Bhutto: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ హాజరయ్యారు. దాదపుగా 12 ఏళ్ల తరువాత ఓ పాకిస్తాన్ ప్రతినిధి ఇండియాకు రావడం ఇదే తొలిసారి. భారత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత పర్యటన విజయవంతం అయిందని, పాకిస్తాన్ ఎస్ సీ ఓలో సభ్యదేశం కావడంతో భారత పర్యటనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 5, 2019న భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే వరకు పాకిస్తాన్, భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను పెట్టుకునే స్థితిలో లేదని ఆయన స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకునేంత వరకు పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకోమని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. భుట్టో మాట్లాడుతూ.. ఉగ్రవాదం కొత్తది కాదని, ఈ సవాలును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్ చాలా నష్టపోయిందని ఆయన అన్నారు. భారత ఆందోళనలను పరిష్కరించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, అయితే భారత్ కూడా పాకిస్తాన్ ఆందోళనల్ని పరిష్కరించాల్సి ఉంటుందని పాక్ జైలులో ఉన్న కుల్ భూషన్ జాదవ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Also Read
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- AI Viral Story: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
- West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
Read Also: Jammu Kashmir: కాశ్మీర్లో రెండు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు.. ఒక ఉగ్రవాది హతం..
2006-14 మధ్య పాకిస్తాన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, టెర్రర్ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్ ను పాకిస్తాన్ అణిచివేసిందని, ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నామని భుట్టో తెలిపారు. ముంబయి దాడుల కేసు విచారణ పాకిస్థాన్లో కొనసాగుతోంది. కేసును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సాక్షులను సమర్పించేందుకు భారత్ నిరాకరించడమే విచారణ ముందుకు సాగకపోవడానికి కారణం అని ఆయన ప్రస్తావించారు. కరాచీలో నివసిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్ కు అప్పగిస్తుందా..? అనే విషయాన్ని దాటవేశాడు.
గిల్గిట్- బాల్టిస్తాన్, పీఓకే నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు కట్టుబడి ఉందని, అయితే ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ జమ్మూ కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణపై ఎందుకు భయపడుతోందని భుట్టో ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదం చాలా క్లిష్టంగా మారిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
-
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
-
SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
-
Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
-
Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!