West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
- మమతా బెనర్జీకి గవర్నర్ షాక్..
- టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
- సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేయనని భీష్మించుకు కూర్చున్న మమతా బెనర్జీకి గవర్నర్ ఆర్ ఎన్ రవి షాక్ ఇచ్చారు. మమతా బెనర్జీ రాజనీమా చేయకపోవడంతో బెంగాల్ టీఎంసీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు. గవర్నర్ మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగినట్లైంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించారు. ఈ రోజు( మే 7) అర్ధరాత్రితో బెంగాల్ అసెంబ్లీ 5 ఏళ్ల కాలపరిమితి ముగుస్తోంది. మరోవైపు ఓడిపోయినా మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో మమతా 15 ఏళ్ల పాలనకు తెరపడింది.
Read Also: Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
Also Read
- Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
- Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్పై ఫిర్యాదు.. రాహుల్గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
- Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
- Kulgam: కుల్గామ్లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
మే 8న బీజేపీ శాననసభా పక్ష నేతను ఎన్నుకోనుంది. మే 9న బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇటీవల 294 అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 స్థానాలను కైవసం చేసుకుంది. టీఎంసీ కేవలం 80 సీట్లకు పరిమితమై ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. సీఎం మమతా భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలైంది.
ఈ ఓటమి తర్వాత మమతా మాట్లాడుతూ.. బీజేపీ గెలుపును దొంగిలించిందని, వారి గెలుపు అనైతికమని ఆరోపించింది. కేంద్ర బలగాలు, ఈసీ సాయంతో బీజేపీ బెంగాల్లో గెలిచిందని దుయ్యబట్టారు. దీని కారణంగా తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. మరోవైపు, 100 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను దొంగిలించినట్లు బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
తాజావార్తలు
-
Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
-
Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్పై ఫిర్యాదు.. రాహుల్గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
-
Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
-
Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!