Mamata Banerjee: వైద్యులపై మమత కరుణ.. భారీగా జీతాలు పెంపు
- వైద్యులపై మమత కరుణ
- భారీగా జీతాలు పెంపు
- రూ.10,000 నుంచి రూ.15, 000 వరకు పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వైద్యులపై కరుణ చూపించారు. ఒకేసారి భారీగా జీతాలు పెంచారు. ప్రభుత్వ వైద్యులకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. అలాగే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునేందుకు దూర పరిమితిని 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు పెంచారు. ఇక ప్రభుత్వ వైద్యుల జీతాలు పెంచిన మమతా బెనర్జీ.. ఆర్జీ కర్ కేసు దోషికి కఠిన శిక్ష విధించాలని తాజాగా మరోసారి డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi into Custody: వంశీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. నేడు పోలీసు కస్టడీకి..
Also Read
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
మమతా బెనర్జీ ముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు ఆరోగ్య శాఖను కూడా ఆమెనే నిర్వర్తిస్తున్నారు. వైద్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో వైద్యుల పాత్రను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె.. సీనియర్ వైద్యులకు రూ. 15,000, ఇంటర్న్లు, హౌస్ స్టాఫ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలతో సహా జూనియర్ వైద్యులకు రూ. 10,000 జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు.
‘‘సీనియర్ వైద్యులు.. జూనియర్ వైద్యులకు చాలా విషయాలు బోధిస్తారు. సి-సెక్షన్ లేదా కార్డియాక్ సర్జరీ అయినా ప్రతిదీ జూనియర్లపై వదిలివేయవద్దని నేను సీనియర్ వైద్యులను అభ్యర్థిస్తాను. ప్రభుత్వ ఆసుపత్రులకు కనీసం ఎనిమిది గంటలు మీ సేవను ఇవ్వండి. తరువాత మీ ప్రైవేట్ ప్రాక్టీస్ను కొనసాగించండి. దానితో నాకు ఎటువంటి సమస్య లేదు.”అని మమత స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాలకు.. సాంస్కృతిక మరియు క్రీడా కార్యకలాపాల కోసం రూ. 2 కోట్ల నిధిని ప్రకటించారు.
వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్ని్కలు జరగనున్నాయి. ఒంటరిగానే బరిలోకి దిగుతామని.. ఎవరితోనూ పొత్తు ఉండదని ఇప్పటికే మమత స్పష్టం చేశారు. నాలుగోసారి కూడా తమదే అధికారమని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా సన్నద్ధం అయిపోతున్నాయి. అయితే గతేడాది ఆర్ జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇక నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. భద్రత కోసం వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మొత్తానికి వైద్యులను మచ్చిక చేసుకునేందుకు మమత వరాల జల్లు కురిపించారు.
ఇది కూడా చదవండి: Covid 19 : ఐదేళ్ల తర్వాత కూడా కరోనా ఎంత ప్రమాదకరం.. అమెరికా నుండి షాకింగ్ నివేదిక
తాజావార్తలు
-
India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
-
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
-
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!