Bangladesh Violence: బంగ్లాదేశ్ హింస, షేక్ హసీనా రాకపై జైశంకర్ కీలక ప్రకటన..
- బంగ్లాదేశ్ పరిస్థితిపై రాజ్యసభలో జైశంకర్..
- భారతీయ సమాజంతో టచ్లో ఉన్నాం..
- మైనారిటీల పరిస్థితిపై ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసపై ఇండియా ఆందోళన చెందుతోంది. తీవ్ర హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో నిన్న బంగ్లా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా, భారత్కి చేరింది. ఇక్కడ నుంచి బ్రిటన్లో ఆశ్రయం పొందేందుకు వెళ్తున్నట్లు సమచారం. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులను టార్గెట్ చేస్తున్నారు హింసాత్మకవాదులు. దీంతో భారత్ అక్కడి మైనారిటీల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read Also: Pregnant Women Diet: ప్రెగ్నన్సీ సమయంలో ఇవి తాగడం ప్రమాదకరం.. పిల్లలపై ప్రతికూల ప్రభావం!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘‘మా దౌత్య కార్యకలాపాల ద్వారా మేము బంగ్లాదేశ్లోని భారతీయ సమాజంతో టచ్లో ఉన్నామని చెప్పారు. అక్కడ 19,000 మంది భారతీయులు ఉన్నారని అంచనా. 9000 మంది విద్యార్థులు జూలైలో తిరిగి వచ్చారు… మేము వారి రక్షణ మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి వివిధ సమూహాలు మరియు సంస్థల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాము. శాంతిభద్రతలను పునరుద్ధరించే వరకు తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఈ సంక్షిష్ట పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని కోరాము. గత 24 గంటలుగా ఢాకాలోని అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఆ దేశంలో మైనారిటీల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నాము’’ అని అన్నారు.
బంగ్లాదేశ్ లో ఉన్న భారత్ దేశ వ్యవస్థలను అక్కడి ప్రభుత్వం కాపాడుతుందని అశిస్తున్నామని అన్నారు. బంగ్లాదేశ్ లోని మైనారిటీలు, వారి వ్యాపారాలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఆ దేశంలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, బంగ్లాదేశ్ సైన్యంతో ఎప్పటికప్పుడు భారత్ మాట్లాడుతూనే ఉందని జైశంకర్ సభలో చెప్పారు. ఆ దేశంలో భారత్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, షేక్ హసీనా భారత్ వస్తానని అభ్యర్థించినట్లు వెల్లడించారు. అతి తక్కువ సమయంలో ఆమె భారత్ వస్తున్నట్లు సమచారం అందినట్లు తెలిపారు.
#WATCH | Speaking in Rajya Sabha on the situation in Bangladesh, External Affairs Minister Dr S Jaishankar says, "…We are in close and continuous touch with the Indian community in Bangladesh through our diplomatic missions. There are an estimated 19,000 Indian nationals there… pic.twitter.com/SJSv1hkQ1f
— ANI (@ANI) August 6, 2024
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!