Delhi: అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ.. దేనికోసమంటే..!
- అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ
- కేరళ ఎంపీలతో కలిసి సమావేశం
- వయనాడ్ బాధితుల్ని ఆదుకోవాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ నేతృత్వంలోని కేరళ ఎంపీల బృందం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా వయనాడ్లో కొండచరియలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాకు వినతి పత్రాన్ని అందించారు.

Also Read
సమావేశం అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు.. వయనాడ్ విలయం కారణంగా పూర్తి విధ్వంసమైందన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు తెలిపారు. నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు బాధితులకు ఎలాంటి సాయం అందలేదన్నారు. బాధితులకు ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారని పశ్నించారు. రాజకీయాలకు అతీతంగా సాయం అందించాలని కోరారు. కేరళ ఎంపీలందరి తరపున ఇచ్చిన వినతిని సీరియస్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ప్రియాంక తెలిపారు.
జూలై 30న వయనాడ్లో భారీ విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడి 231 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై గురువారం సాయంత్రంలోగా అప్డేట్ చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. పుంఛిరిమట్టం, చూరల్మల, ముండక్కై మూడు గ్రామాల్లో విస్తృతమైన నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ ఇంతవరకు చెప్పుకోదగ్గ సాయం అందలేదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
A delegation of Kerala MPs led by Congress Wayanad MP Priyanka Gandhi Vadra met Home Minister Amit Shah, earlier today. They urged the Centre to release financial aid for landslide-affected people in Wayanad
(Source: AICC) https://t.co/ZJ9a85CKjt pic.twitter.com/tfFNxpDLhT
— ANI (@ANI) December 4, 2024
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!