Delhi: అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ.. దేనికోసమంటే..!
- అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ
- కేరళ ఎంపీలతో కలిసి సమావేశం
- వయనాడ్ బాధితుల్ని ఆదుకోవాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ నేతృత్వంలోని కేరళ ఎంపీల బృందం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా వయనాడ్లో కొండచరియలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాకు వినతి పత్రాన్ని అందించారు.

Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
సమావేశం అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు.. వయనాడ్ విలయం కారణంగా పూర్తి విధ్వంసమైందన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు తెలిపారు. నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు బాధితులకు ఎలాంటి సాయం అందలేదన్నారు. బాధితులకు ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారని పశ్నించారు. రాజకీయాలకు అతీతంగా సాయం అందించాలని కోరారు. కేరళ ఎంపీలందరి తరపున ఇచ్చిన వినతిని సీరియస్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ప్రియాంక తెలిపారు.
జూలై 30న వయనాడ్లో భారీ విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడి 231 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై గురువారం సాయంత్రంలోగా అప్డేట్ చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. పుంఛిరిమట్టం, చూరల్మల, ముండక్కై మూడు గ్రామాల్లో విస్తృతమైన నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ ఇంతవరకు చెప్పుకోదగ్గ సాయం అందలేదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
A delegation of Kerala MPs led by Congress Wayanad MP Priyanka Gandhi Vadra met Home Minister Amit Shah, earlier today. They urged the Centre to release financial aid for landslide-affected people in Wayanad
(Source: AICC) https://t.co/ZJ9a85CKjt pic.twitter.com/tfFNxpDLhT
— ANI (@ANI) December 4, 2024
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!