Delhi: అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ.. దేనికోసమంటే..!
- అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ
- కేరళ ఎంపీలతో కలిసి సమావేశం
- వయనాడ్ బాధితుల్ని ఆదుకోవాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ నేతృత్వంలోని కేరళ ఎంపీల బృందం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా వయనాడ్లో కొండచరియలు విరిగిపడి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాకు వినతి పత్రాన్ని అందించారు.

Also Read
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
సమావేశం అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు.. వయనాడ్ విలయం కారణంగా పూర్తి విధ్వంసమైందన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు తెలిపారు. నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు బాధితులకు ఎలాంటి సాయం అందలేదన్నారు. బాధితులకు ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారని పశ్నించారు. రాజకీయాలకు అతీతంగా సాయం అందించాలని కోరారు. కేరళ ఎంపీలందరి తరపున ఇచ్చిన వినతిని సీరియస్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ప్రియాంక తెలిపారు.
జూలై 30న వయనాడ్లో భారీ విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడి 231 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై గురువారం సాయంత్రంలోగా అప్డేట్ చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. పుంఛిరిమట్టం, చూరల్మల, ముండక్కై మూడు గ్రామాల్లో విస్తృతమైన నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ ఇంతవరకు చెప్పుకోదగ్గ సాయం అందలేదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
A delegation of Kerala MPs led by Congress Wayanad MP Priyanka Gandhi Vadra met Home Minister Amit Shah, earlier today. They urged the Centre to release financial aid for landslide-affected people in Wayanad
(Source: AICC) https://t.co/ZJ9a85CKjt pic.twitter.com/tfFNxpDLhT
— ANI (@ANI) December 4, 2024
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?