Wayanad landslide: వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 ఫుట్బాల్ మైదానాలతో సమానం: ఇస్రో..
- వయనాడ్ ఘటనలో 293కి చేరిన మృతుల సంఖ్య..
- కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 ఫుట్బాల్ మైదానాలతో సమానం..
- విపత్తుని అంచనా వేసిన ఇస్రో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad landslide: ప్రకృతి అందాలకు నెలవైన వయనాడ్ ప్రాంతం ప్రస్తుతం మృతుల దిబ్బను తలపిస్తోంది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కారణంగా వాయనాడ్లో మంగళవారం మూడు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రజలు చాలా మంది బురద కింద సమాధి అయ్యారు. ఈ ప్రకృతి విపత్తులో 293 మంది చనిపోయారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ రెస్కూ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు 1000 మందిని రక్షించింది. రోజురోజుకి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో 240 మంది ఇప్పటికీ కనిపించడం లేదు.
Read Also: Thummala: బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఓ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా?
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ఇస్రోతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా శాటిలైట్ చిత్రాలు ఈ విపత్తు ఏ మేరకు ఉందనే విషయాన్ని అంచనా వేశాయి. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 కంటే ఎక్కువ ఫుట్బాల్ మైదానాలతో సమానంగా ఉందని అంచనా వేసింది. కొండచరియలు విరిగిపడి ఇరువజింఝి నదిలోకి జారిపోయాయి. దీంతో వివత్తు ఏర్పడింది. ఉపగ్రహ డేటా ఆధారంగా ఇస్రో గురువారం కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించింది. సుమారుగా ఈ ప్రాంతంలో 86,000 చదరపు మీటర్లు అంటే, ఫిఫా నిబంధనల ప్రకారం ఒక్కో ఫుట్బాల్ మైదానం 6400 చ.మీ ఉంటుంది, కొండచరియలు విరిగిపడిన ప్రాంతం 13 ఫుట్బాట్ స్టేడియాల కన్నా ఎక్కువ.

జూలై 30 తెల్లవారుజామున వైత్తిరి తాలూకాలోని ముండక్కై, చూరల్మల, అట్టమల గ్రామాలు ప్రభావితమయ్యాయి. జూలై 31న దాని RISAT-2B ఉపగ్రహం ద్వారా సంగ్రహించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఇస్రో విశ్లేషించింది. బురద, పెద్ద పెద్ద బండరాళ్లు, నెలకొరిగిన చెట్లు సుమారు 8 కి.మీ వెళ్లి చెలియార్ నది ఉపనదిలో పడిపోయాయి. ఇది ఇరవానిఫుజార్ నది గమనాన్ని పెంచింది. ఫలితంగా బురదతో కూడిన వరద ఊళ్లపై విరుచుకుపడింది. విపత్తుకు కేంద్రంగా ఉన్న ఇరువజింఝి నది, ఇది ముండక్కైకి ఎగువన 3 కి.మీ దూరంలో ఉద్భవిస్తుంది. సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులో కొండచరియలు విరిగిపోయినట్లు ఇస్రో తెలిపింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సెంటినెల్-1 ఉపగ్రహం ఆగస్ట్ 1, 2024 గురువారం వయనాడ్లోని బురద ప్రవాహాన్ని సంగ్రహించింది.
తాజావార్తలు
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!