Watermelon: ఛత్తీస్గఢ్లోని ఘుర్ కోట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిలో పుచ్చకాయ, ఇతర ఆహార పదార్థాలు తిన్న కొన్ని గంటల్లోనే ఐదుగురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించగా, నలుగురు పరిస్థితి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లో ఉంచిన పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఇలా జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Read Also: AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ఛత్తీస్గఢ్ జాంజ్గిర్-చంపా జిల్లాలో ఒక పెళ్లి వేడుక తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉంచిన పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే పిల్లలు వాంతులు చేసుకోవడం, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటం కుటుంబీకులు ఆందోళన చెందారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించే లోపే 15 ఏళ్ల అఖిలేష్ ధీవర్ స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికే వైద్యులు అతను మరణించినట్లు చెప్పారు.
ఈ ఘటనపై స్థానిక జిల్లా యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. కలెక్టర్ జన్మేజయ్ మహోబే ఈ సంఘటను సుమోటోగా స్వీకరించారు. అసలు కారణం ఏంటనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. పిల్లలు తిన్న పుచ్చకాయ, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. వీటిని పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. చికిత్స పొందుతున్న నలుగురు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.
