Bengaluru: బెంగళూరు ప్రజలకు షాక్.. పెరిగిన నీటి ధరలు నేటి నుంచే అమలు
- బెంగళూరు ప్రజలకు షాక్..
- నేటి నుంచే పెరిగిన నీటి ధరలు అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నీటి ధరలు పెరగనున్నాయి. తాగు నీటి పన్నును లీటరుకు 7-8 పైసలు పెంచినట్లు బెంగళూరు నీటి సరఫరా బోర్డు పేర్కొనింది. అయితే, గత దశాబ్ద కాలంగా బెంగళూరు జనాభాతో పాటు భౌగోళిక విస్తరణలో వేగంగా వృద్ధి చెందింది. ఇక, ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా చేయాలంటే సరైన నిధులు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు BWSSB చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ పేర్కొన్నారు.
Read Also: Virat Kohli: ఎప్పుడూ అహానికి పోను.. విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
అయితే, 2014 నుంచి బెంగళూరు నగరంలో నీటి పన్ను పెంచలేదని BWSSB చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ తెలిపారు. ప్రస్తుతం నీటి సరఫరా బోర్డు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం కారణంగా తాజా రేటు పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గత 10 ఏళ్లలో విద్యుత్ ఖర్చులు 107 శాతం పెరిగాయి, నిర్వహణ ఖర్చులు 122.5 శాతం పెరిగాయి.. నెలకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డుకి ప్రస్తుతం రూ.120 కోట్లు మాత్రమే వస్తున్నాయరి చెప్పుకొచ్చారు. దీని ఫలితంగా నెలకు రూ.80 కోట్ల లోటు ఏర్పడిందని వెల్లడించారు. ఆ లోటును భర్తీ చేసేందుకే.. ఇప్పుడు ధరలను పెంచినట్లు రామ్ ప్రసాద్ మనోహర్ చెప్పుకొచ్చారు.
Read Also: China Vs India: అమెరికా దెబ్బకి.. భారత్తో దోస్తీకి చైనా ప్లాన్
కాగా, కర్ణాటక రాష్ట్ర పరిపాలనా సంస్కరణల కమిషన్ సిఫార్సులను అనుసరించి.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3 శాతం నీటి ఛార్జీల పెంపు ఉండబోతుందని బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు ఛైర్మన్ మనోహర్ తెలిపారు. ఇక, పెంచిన నీటి ధరలు ఇలా ఉన్నాయి..
* ఒక లీటరుకు 0.15 పైసలు..
* 8,000 లీటర్ల వరకు అయితే 0.30 పైసలు..
* 25,001 నుంచి 50,000 లీటర్ల వరకు లీటరుకు 0.80 పైసలు..
* 50,001 లీటర్లకు మించితే లీటరుకు రూపాయి చొప్పున పెంపు..
* 2,00,000 లీటర్ల వరకు ఎత్తైన గృహ భవనాలకు లీటరుకు 0.30 పైసలు
* 2,00,001 నుంచి 5,00,000 లీటర్ల వరకు లీటరుకు 0.60 పైసలు
* 5,00,001 లీటర్లకు మించి ఉంటే లీటరుకు రూపాయి చొప్పున పెంచనున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?