Bengaluru: బెంగళూరు ప్రజలకు షాక్.. పెరిగిన నీటి ధరలు నేటి నుంచే అమలు
- బెంగళూరు ప్రజలకు షాక్..
- నేటి నుంచే పెరిగిన నీటి ధరలు అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో నీటి ధరలు పెరగనున్నాయి. తాగు నీటి పన్నును లీటరుకు 7-8 పైసలు పెంచినట్లు బెంగళూరు నీటి సరఫరా బోర్డు పేర్కొనింది. అయితే, గత దశాబ్ద కాలంగా బెంగళూరు జనాభాతో పాటు భౌగోళిక విస్తరణలో వేగంగా వృద్ధి చెందింది. ఇక, ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా చేయాలంటే సరైన నిధులు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు BWSSB చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ పేర్కొన్నారు.
Read Also: Virat Kohli: ఎప్పుడూ అహానికి పోను.. విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!
Also Read
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
అయితే, 2014 నుంచి బెంగళూరు నగరంలో నీటి పన్ను పెంచలేదని BWSSB చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ తెలిపారు. ప్రస్తుతం నీటి సరఫరా బోర్డు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం కారణంగా తాజా రేటు పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గత 10 ఏళ్లలో విద్యుత్ ఖర్చులు 107 శాతం పెరిగాయి, నిర్వహణ ఖర్చులు 122.5 శాతం పెరిగాయి.. నెలకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డుకి ప్రస్తుతం రూ.120 కోట్లు మాత్రమే వస్తున్నాయరి చెప్పుకొచ్చారు. దీని ఫలితంగా నెలకు రూ.80 కోట్ల లోటు ఏర్పడిందని వెల్లడించారు. ఆ లోటును భర్తీ చేసేందుకే.. ఇప్పుడు ధరలను పెంచినట్లు రామ్ ప్రసాద్ మనోహర్ చెప్పుకొచ్చారు.
Read Also: China Vs India: అమెరికా దెబ్బకి.. భారత్తో దోస్తీకి చైనా ప్లాన్
కాగా, కర్ణాటక రాష్ట్ర పరిపాలనా సంస్కరణల కమిషన్ సిఫార్సులను అనుసరించి.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3 శాతం నీటి ఛార్జీల పెంపు ఉండబోతుందని బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు ఛైర్మన్ మనోహర్ తెలిపారు. ఇక, పెంచిన నీటి ధరలు ఇలా ఉన్నాయి..
* ఒక లీటరుకు 0.15 పైసలు..
* 8,000 లీటర్ల వరకు అయితే 0.30 పైసలు..
* 25,001 నుంచి 50,000 లీటర్ల వరకు లీటరుకు 0.80 పైసలు..
* 50,001 లీటర్లకు మించితే లీటరుకు రూపాయి చొప్పున పెంపు..
* 2,00,000 లీటర్ల వరకు ఎత్తైన గృహ భవనాలకు లీటరుకు 0.30 పైసలు
* 2,00,001 నుంచి 5,00,000 లీటర్ల వరకు లీటరుకు 0.60 పైసలు
* 5,00,001 లీటర్లకు మించి ఉంటే లీటరుకు రూపాయి చొప్పున పెంచనున్నారు.
తాజావార్తలు
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..