Virat Kohli: ఎప్పుడూ అహానికి పోను.. విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!
- పరిస్థితులకు తగినట్లు బ్యాటింగ్ చేయాలనుకుంటా
- ఎప్పుడూ ఒకరిని అధిగమించాలని చూడను
- మంచి లయలో ఉంటే ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తా
మైదానంలో మ్యాచ్ పరిస్థితులకు తగినట్లు బ్యాటింగ్ చేయాలనుకుంటానని, అస్సలు అహానికి పోనని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఎల్లప్పుడూ మ్యాచ్ పరిస్థితులకు తగినట్లు అర్థం చేసుకుని తాను బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. ఎప్పుడూ ఒకరిని అధిగమించాలని చూడనని విరాట్ చెప్పుకొచ్చాడు. ఆధునిక క్రికెట్లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. ఐపీఎల్ 2025 సందర్భంగా టీ20 క్రికెట్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి బ్యాటర్గా అరుదైన ఘనతను అందుకున్నాడు.
తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తన బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ అహానికి పోను. ఎప్పుడూ కూడా ఒకరిని అధిగమించాలని అస్సలు చూడను. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని, అందుకు తగినట్లు బ్యాటింగ్ చేస్తా. పరిస్థితులు డిమాండ్ చేసినట్లు ఆడతా. అందుకు నేను చాలా గర్విస్తా. నేను మంచి లయలో ఉంటే ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తా. నా సహచర ప్లేయర్ దూకుడుగా ఆడుతుంటే.. అతడికే మద్దతిస్తా. ఎప్పుడూ బంతిని చూసి ఆడుతా. ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అవుతాం’ అని విరాట్ తెలిపాడు.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
‘ఐపీఎల్లో మొదటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ఆడుతున్నా. తొలి మూడేళ్లలో టాప్ ఆర్డర్లో ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో నేను దిగువన వచ్చేవాడిని. ఆ సమయంలో పెద్దగా రన్స్ చేయలేదు. 2010 నుంచి నిలకడగా ప్రదర్శన చేయడం మొదలెట్టా. 2011 నాటికి నేను రెగ్యులర్ నంబర్.3 ఆటగాడిగా మారిపోయా. ఆ సమయంలోనే నా ఐపీఎల్ ప్రయాణం ఓ రూపు సంతరించుకుంది’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు. 2008 నుంచి ఆర్సీబీ తరఫున కింగ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 256 మ్యాచ్ల్లో 8 సెంచరీలతో 8168 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!