Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay-Trisha: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో భారీ విజయాన్ని అందుకున్న దళపతి విజయ్, ప్రస్తుతం రాజకీయంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితంతోనూ హాట్ టాపిక్గా మారారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోవైపు నటి త్రిష కృష్ణన్తో ఆయనకున్న అనుబంధంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా త్రిష ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వింత పోస్ట్ ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. తన వెనకాల గుసగుసలాడే వారికి కౌంటర్ ఇచ్చేలా “Blah Blah”, “IYKYK” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే రాఖీ సావంత్ వంటి సెలబ్రిటీలు సైతం వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని వ్యాఖ్యానించడం విశేషం. అయితే, గత 25 ఏళ్లుగా సంగీతతో వైవాహిక జీవితాన్ని గడుపుతున్న విజయ్, ప్రస్తుతం ఆమెతో విడిపోతున్నారనే వార్తలు వస్తుండటం, అదే సమయంలో త్రిష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ మొత్తం వ్యవహారం కోలీవుడ్లో పెను సంచలనంగా మారింది. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో మొదలైన వీరి బంధంపై ఎన్ని ఊహాగానాలు వస్తున్నా, విజయ్, త్రిష మాత్రం ఇప్పటివరకు దీనిపై మౌనం వీడలేదు.
ఇదిలా ఉండగా.. తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఉత్కంఠ కొనసాగుతోంది. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన జోసెఫ్ విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారా? లేదా? అనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ విషయంలో ప్రతిష్టంభన వీడటం లేదు. వాస్తవానికి మే 9, 2026 (శనివారం) ఉదయం 11 గంటలకు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భారీగా ప్రచారం జరిగింది. కానీ, చివరి నిమిషంలో చోటుచేసుకున్న రాజకీయ సమీకరణలు ఈ ప్రక్రియను సందిగ్ధంలో పడేశాయి. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాకపోవడంతో పొత్తుల రాజకీయం మొదలైంది. ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీవీకేకు బేషరతు మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో విజయ్ ఇప్పటికే మూడంచెల కసరత్తు చేస్తూ, గత 48 గంటల్లో మూడుసార్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. తనకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇందులో వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) పార్టీలకు చెందిన ఇద్దరేసి ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని గవర్నర్కు వివరించారు. అయితే, ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. విజయ్ కేవలం 116 మంది ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన హార్డ్ కాపీలను మాత్రమే గవర్నర్కు సమర్పించినట్లు సమాచారం. మరోవైపు వీసీకే పార్టీ తన నిర్ణయాన్ని ఈరోజు వెల్లడిస్తామని చెప్పడం, తొలుత మద్దతు ఇస్తుందని భావించిన ఐయూఎంఎల్ తాము ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదని స్పష్టం చేయడంతో లెక్కలు తలకిందులయ్యాయి. ఇదే సమయంలో సీపీఐ, సీపీఎంలు టీవీకేకు మద్దతు లేఖలు అందజేయడం విజయ్కు కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది.
Also Read
- Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
- Suvendu Adhikari: నేడే సువేందు ప్రమాణ స్వీకారం.. దీదీని గద్దె దించిన బెంగాల్ బాద్షా గురించి ఆసక్తికర విషయాలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
తాజావార్తలు
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
-
Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!
-
Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..
-
Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
-
Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..