Vijay Rupani: నేడు అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. లండన్లో ఉంటున్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రాణాలు చనిపోయారు. ఇందులో విజయ్ రూపానీ ఉన్నారు. డీఎన్ఏ టెస్ట్ ద్వారా 3 రోజుల తర్వాత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు.
ఇది కూడా చదవండి: Trump: నేను శాంతి కోసం చాలా చేస్తాను.. కానీ నాకు క్రెడిట్ దక్కదు
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ఇక సోమవారం అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజ్కోట్లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Kamal hassan : ‘థగ్ లైఫ్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేశారా?
ఇక విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలో విజయ్ రూపానీ ఆనందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు బ్రిటిష్ జాతీయులు చిత్రీకరించిన వీడియోలో దృశ్యాలు కనిపించాయి.

విజయ్ రూపానీ లండన్ టికెట్ను రెండుసార్లు రద్దు చేసుకున్నారు. మే 19, జూన్ 5న లండన్ వెళ్లాలనుకున్నారు. కానీ రెండు సార్లు రద్దైంది. జూన్ 25 తిరిగి రావాలని అనుకున్నారు. ఎట్టకేలకు మూడోసారి జూన్ 12 ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ మూడోసారి మృత్యువుకు దిరికిపోయారు.
జూన్ 12న ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక మెడికోలు కూడా ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. ఇక చికిత్స పొందుతున్న వారు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజావార్తలు
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!