TVK Party: విజయ్ రాజకీయాల్లోకి రావటం ఇండియా కూటమికే లాభం..
- విజయ్ రాజకీయాల్లోకి రావటం ఇండియా కూటమికే లాభం..
- రాజకీయ రంగంలో విజయ్ ప్రవేశం రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు తీసుకురాదు..
- 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఓట్లను విజయ్ పార్టీ చీల్చుతుంది: తమిళనాడు కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Party: తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలకు నటుడు విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇవ్వటంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ రాజకీయ ప్రవేశం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాదు.. ఆయన రాజకీయ ప్రవేశం ఇండియా కూటమి విజయానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లను, ముఖ్యంగా ప్రతిపక్ష ఓట్లను విజయ్ పార్టీ చీల్చుతుందని టీఎన్సీసీ చీఫ్ సెల్వపెరుంతగై వెల్లడించారు.
Read Also: Zelensky: రష్యాపై క్షిపణులతో దాడి చేస్తా.. పర్మిషన్ ఇవ్వండి
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
కాగా, దళపతి విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇండియా కూటమి మిత్రపక్షలు ఎలాంటి అలజడికి గురికాలేదని సెల్వపెరుంతగై పేర్కొన్నారు. దేశంలో ఇండియా కూటమి బలంగానే ఉంది.. కాంగ్రెస్ 2004- 2014 మధ్య కేంద్రంలో అధికారాన్ని షేర్ చేసుకుంది.. దాని ఆధారంగా.. మేం అధికారం పంచుకునే ఆలోచనతో అంగీకరిస్తున్నామన్నారు. అయితే, అధికారాన్ని పంచుకోవడంపై జాతీయ నాయకత్వందే తుది నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి సాధారణ మెజారిటీ వచ్చే అవకాశం లేదు.. కాబట్టి కాంగ్రెస్ మద్దతుతో మాత్రమే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉందని టీఎన్సీసీ చీఫ్ సెల్వపెరుంతగై తెలిపారు.
Read Also: Ponnam Prabhakar: దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి.. నవంబర్ 6 నుండి ప్రారంభం..
సోనియా గాంధీ నేతృత్వంలో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా సపోర్టు ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. అధికారంలో వాటా కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉంటే అప్పటి సీఎం కరుణానిధి ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలో వాటా తీసుకోలేదు.. అధికార భాగస్వామ్యం ప్రజల ఆదేశంపై ఆధారపడి ఉంటుందని సెల్వపెరుంతగై వెల్లడించారు. ప్రతి రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటుంది.. మేం తమిళనాడులో కామరాజ్ పాలనను ప్రారంభిస్తామని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!