TVK Party: విజయ్ రాజకీయాల్లోకి రావటం ఇండియా కూటమికే లాభం..
- విజయ్ రాజకీయాల్లోకి రావటం ఇండియా కూటమికే లాభం..
- రాజకీయ రంగంలో విజయ్ ప్రవేశం రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు తీసుకురాదు..
- 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఓట్లను విజయ్ పార్టీ చీల్చుతుంది: తమిళనాడు కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Party: తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలకు నటుడు విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇవ్వటంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ రాజకీయ ప్రవేశం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాదు.. ఆయన రాజకీయ ప్రవేశం ఇండియా కూటమి విజయానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లను, ముఖ్యంగా ప్రతిపక్ష ఓట్లను విజయ్ పార్టీ చీల్చుతుందని టీఎన్సీసీ చీఫ్ సెల్వపెరుంతగై వెల్లడించారు.
Read Also: Zelensky: రష్యాపై క్షిపణులతో దాడి చేస్తా.. పర్మిషన్ ఇవ్వండి
Also Read
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
కాగా, దళపతి విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇండియా కూటమి మిత్రపక్షలు ఎలాంటి అలజడికి గురికాలేదని సెల్వపెరుంతగై పేర్కొన్నారు. దేశంలో ఇండియా కూటమి బలంగానే ఉంది.. కాంగ్రెస్ 2004- 2014 మధ్య కేంద్రంలో అధికారాన్ని షేర్ చేసుకుంది.. దాని ఆధారంగా.. మేం అధికారం పంచుకునే ఆలోచనతో అంగీకరిస్తున్నామన్నారు. అయితే, అధికారాన్ని పంచుకోవడంపై జాతీయ నాయకత్వందే తుది నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి సాధారణ మెజారిటీ వచ్చే అవకాశం లేదు.. కాబట్టి కాంగ్రెస్ మద్దతుతో మాత్రమే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉందని టీఎన్సీసీ చీఫ్ సెల్వపెరుంతగై తెలిపారు.
Read Also: Ponnam Prabhakar: దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి.. నవంబర్ 6 నుండి ప్రారంభం..
సోనియా గాంధీ నేతృత్వంలో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా సపోర్టు ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. అధికారంలో వాటా కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉంటే అప్పటి సీఎం కరుణానిధి ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలో వాటా తీసుకోలేదు.. అధికార భాగస్వామ్యం ప్రజల ఆదేశంపై ఆధారపడి ఉంటుందని సెల్వపెరుంతగై వెల్లడించారు. ప్రతి రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటుంది.. మేం తమిళనాడులో కామరాజ్ పాలనను ప్రారంభిస్తామని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!