Amit Shah: ఏపీ, ఒడిశాలో గెలవబోతున్నాము.. అమిత్ షా ధీమా..
Amit Shah: లోక్సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. జూన్ 1న చివరిదైన ఏడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఎంపీ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల తో పాటు మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, అలాగే మిత్రపక్షం చంద్రబాబు నాయుడితో కలిసి ఏపీలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తప్పకుండా 400 సీట్లను దాటుతుందని, ఒడిశా, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పారు.ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరే కారణమని ఆయన అన్నారు.
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
Read Also: Cyclone Remal: తీవ్ర తుఫానుగా మారిన ‘రెమల్’.. బంగ్లాదేశ్, బెంగాల్ తీరాన్ని తాకనున్న తుఫాన్
147 స్థానాలు ఉన్న ఒడిశా అసెంబ్లీలో 75 సీట్లు, రాష్ట్రంలోని 21 లోక్సభ స్థానాల్లో 16-17 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ అంచనా వేస్తోంది. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలకు గానూ ఈ సారి 24-30 మధ్య సీట్లు సాధిస్తామని చెబుతోంది. ఏపీలో 25 ఎంపీ స్థానాలకు దాదాపుగా 17 ఎన్డీయే కూటమి ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేస్తోంది.
అవినీతి, గోవులు-బొగ్గు అక్రమ రవాణా, చొరబాట్లపై ప్రజలు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారని అమిత్ షా అన్నారు. సందేశ్ఖాలీ వివాదం, మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల ఫలితమే అని చెప్పారు. తమిళనాడులో బీజేపీ గట్టిపోటీ ఇచ్చిందని, మాకు ఆ రాష్ట్రంలో కొత్త టీం ఉందని, ఆ రాష్ట్రంలో బీజేపీ సీట్లు, ఓట్లశాతం పెరుగుతుందని, తమిళనాడులో ఖచ్చితంగా బలమైన పునాది వేస్తామని చెప్పారు. కేరళలో పార్టీ ఈ సారి ఖాతా తెరుస్తుందని, మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!