PM Modi: “గెలుపోటములు రాజకీయాల్లో భాగమే, అంకెల ఆట కొనసాగుతుంది”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గెలుపోటములు రాజకీయాల్లో భాగమే అని చివరి క్యాబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందు నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న ప్రధాని మోదీ బీజేపీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది . మ్యాజిక్ ఫిగర్ 272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం అధికారం కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూలపై ఆధారపడాల్సి వస్తోంది.
గత 10 ఏళ్లుగా మంచి పనులు చేశాం, మనం దానిని కొనసాగిస్తాము అని ప్రధాని సహచర మంత్రులతో అన్నారు. మరోసారి అధికారం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. ‘‘ గెలుపు ఓటమి రాజకీయాల్లో భాగమని, అంకెల ఆట కొనసాగుతుంది’’ అని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లుగా తమ సేవల్ని అందించిన కేంద్రమంత్రులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అంతా కష్టపడి పనిచేశారని కొనియాడారు.
Also Read
- Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్కి బిగ్ షాక్..బెయిల్ని తిరస్కరించిన కోర్టు..
ఈ సమావేశం తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రధానిగా తన రాజీనామాను రాష్ట్రపతికి అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ప్రస్తుతం లోక్సభ గడువు జూన్ 16తో ముగుస్తోంది. జూన్ 08న ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 292 స్థానాలు వచ్చాయి. 240 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. మరోవైపు ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ సొంతగా 99 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఫలితాలు ఆ పార్టీని షాక్కి గురిచేశాయి. ఉత్తర్ ప్రదేశ్లో రెండు పర్యాయాలుగా అప్రహతికంగా ఫలితాలు సాధిస్తున్న బీజేపీకి ఇండియా కూటమి అడ్డుకట్ట వేసింది. మొత్తం 80 స్థానాల్లో కేవలం బీజేపీ 33 సీట్లను మాత్రమే గెలుచుకోగా.. ప్రతిపక్ష సమాజ్వాదీ (ఎస్పీ) 37, కాంగ్రెస్ 06 స్థానాలు సాధించాయి.
తాజావార్తలు
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
-
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు…
-
Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!