PM Modi: “గెలుపోటములు రాజకీయాల్లో భాగమే, అంకెల ఆట కొనసాగుతుంది”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గెలుపోటములు రాజకీయాల్లో భాగమే అని చివరి క్యాబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందు నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న ప్రధాని మోదీ బీజేపీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది . మ్యాజిక్ ఫిగర్ 272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం అధికారం కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూలపై ఆధారపడాల్సి వస్తోంది.
గత 10 ఏళ్లుగా మంచి పనులు చేశాం, మనం దానిని కొనసాగిస్తాము అని ప్రధాని సహచర మంత్రులతో అన్నారు. మరోసారి అధికారం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. ‘‘ గెలుపు ఓటమి రాజకీయాల్లో భాగమని, అంకెల ఆట కొనసాగుతుంది’’ అని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లుగా తమ సేవల్ని అందించిన కేంద్రమంత్రులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అంతా కష్టపడి పనిచేశారని కొనియాడారు.
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్కి బిగ్ షాక్..బెయిల్ని తిరస్కరించిన కోర్టు..
ఈ సమావేశం తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రధానిగా తన రాజీనామాను రాష్ట్రపతికి అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ప్రస్తుతం లోక్సభ గడువు జూన్ 16తో ముగుస్తోంది. జూన్ 08న ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 292 స్థానాలు వచ్చాయి. 240 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. మరోవైపు ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ సొంతగా 99 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఫలితాలు ఆ పార్టీని షాక్కి గురిచేశాయి. ఉత్తర్ ప్రదేశ్లో రెండు పర్యాయాలుగా అప్రహతికంగా ఫలితాలు సాధిస్తున్న బీజేపీకి ఇండియా కూటమి అడ్డుకట్ట వేసింది. మొత్తం 80 స్థానాల్లో కేవలం బీజేపీ 33 సీట్లను మాత్రమే గెలుచుకోగా.. ప్రతిపక్ష సమాజ్వాదీ (ఎస్పీ) 37, కాంగ్రెస్ 06 స్థానాలు సాధించాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!