US Student Visas: అమెరికా స్టూడెంట్ వీసాల్లో ఇండియా రికార్డు.. ప్రపంచంలో మనమే ఫస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US issues 82,000 student visas to Indians in 2022: భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మెరుగైన విద్య, అవకాశాల కోసం భారతీయులు అమెరికా వైపు చూస్తున్నారు. ప్రపంచంలో భారతీయ విద్యార్థులు వెళ్లే విదేశాల్లో అమెరికా తర్వాతనే ఇతర దేశాలు ఉన్నాయి. కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటివి అమెరికా తర్వాతనే ఉన్నాయి. తాజాగా ఈ విషయాన్ని రుజువుచేస్తూ రికార్డు స్థాయిలో ఈ ఏడాది వీసాలను జారీ చేసింది అమెరికా.
భారతదేశంలో ఉన్న కాన్సులేట్ల ద్వారా 2022లో ఇప్పటి వరు 82,000 స్టూడెంట్ వీసాలు జారీ అయ్యాయి. ఇది మునపటి ఏడాది కన్నా చాలా ఎక్కువ. ప్రపంచంలో ఇతర దేశాల కన్నా భారతీయ విద్యార్థులే ఎక్కువ స్టూడెంట్ వీసాలను పొందారు. న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబైలోని కాన్సులేట్లు మే నుంచి ఆగస్టు వరకు స్టూడెంట్ వీసాల ప్రాసెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. వీలైనంత ఎక్కువ మంది స్టూడెంట్స్ వారి క్లాసెస్ ప్రారంభానికి ముందే చేరుకునేలా చేశామని యూఎస్ రాయబార కార్యాలయం ప్రకటించింది.
Also Read
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
Read Also: Tagore Scene Repeat In Telangana: ఠాగూర్ సీన్ రిపీట్.. చనిపోయిన మహిళకు చికిత్స
ఈ వేసవిలోనే 82,000 స్టూడెంట్ వీసాలు జారీ చేశామని.. ఇది మునపటి ఏడాది కన్నా ఎక్కువ అని.. ఇది భారతీయులు ఉన్నత విద్య కోసం ఎక్కువగా వెళ్లే దేశాల్లో అమెరికా ఉందని ఇది చూపిస్తుందని భారత్ లోని యూఎస్ సీనియర్ దౌత్యవేత్త చార్జ్ డి అఫైర్స్ ప్యాట్రిసియా లాసినా అన్నారు. గతంలో కోవిడ్ -19 కారణంగా ఆలస్యం జరిగిందని.. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు వీసాలు పొందడం.. గడువులోగా వారి యూనివర్సిటీలకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కొనసాగించడం.. రెండు దేశాలకు భారతీయ విద్యార్థులు అందించే సహాకారాన్ని ఇది పెంపొందిస్తుందని ఆమె అన్నారు. కాన్సులర్ వ్యవహారాల మంత్రి కౌన్సిలర్ డాన్ హెప్లిన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ విద్యార్థుల చైతన్యం యూఎస్ దౌత్యానికి ప్రధానమైనదని అన్నారు.
2020-21 విద్యా సంవత్సరంలో భారతదేశం నుంచి 1,67,582 మంది విద్యార్థులు ఉన్నట్లు ‘ఓపెన్ డోర్స్’ నివేదిక 2021లో వెల్లడించింది. యూఎస్ఏలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతదేశానికి చెందిన విద్యార్థులే 20 శాతం మంది ఉన్నారు.
తాజావార్తలు
-
Tarique Rahman: నవంబర్లో భారత్కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్ను క్లీన్స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..