Tagore Scene Repeat In Telangana: ఠాగూర్ సీన్ రిపీట్.. చనిపోయిన మహిళకు చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tagore Movie Scene Repeated in Telangana Private Hospital: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని ఆసుపత్రి సీన్ గుర్తుందా? అప్పట్లో అది పెను సంచలనమే అయ్యింది. వ్యక్తి చనిపోయినా అతడు బ్రతికే ఉన్నాడంటూ అబద్ధం చెప్పి.. వైద్యం పేరుతో లక్షలకు లక్షలు ప్రైవేటు ఆసుపత్రులు కాజేస్తుంటాయని ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఆ సినిమాలో చూపించినట్టుగానే.. రియల్ లైఫ్లోనూ కొన్ని సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఆ సినిమా సీన్.. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో కూడా రిపీట్ అయ్యింది. చనిపోయిన పేషెంట్ బ్రతికే ఉందని నమ్మించి, లక్షలు కొట్టేయాలని చూశారు. చివరికి అడ్డంగా బుక్కయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళను ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సిజేరియన్ ద్వారా డెలివరీ చేయగా.. ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. కానీ.. ఆమె ఆరోగ్యం క్షణించడంతో కాసేపటికే మరణించింది. అయితే, ఈ విషయాన్ని వైద్యులు దాచిపెట్టారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పారు. చెప్పినట్లుగానే ఆమెను హైదరాబాద్కి తరలించి.. అక్కడ ఆమెకు మెరుగైన చికిత్స అందుతోందని, త్వరగానే కోలుకుంటోందని కూడా చెప్పారు. డాక్టర్లను జనాలు దేవుళ్లకి సమానంగా పూజిస్తారు కదా.. అందుకే వాళ్లు చెప్పిన ప్రతీదీ నమ్మేశారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
అయితే.. కొంతసేపు తర్వాత ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. ఆమెను కాపాడేందుకు తాము సాయశక్తులా ప్రయత్నించామని, కానీ తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. వైద్యుల తీరుపై బంధువులకు అనుమానం రావడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దే ఆందోళనకు దిగారు. గొడవ పెద్దదై తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో.. తాము రూ. 8 లక్షలు ఇస్తామని ఆ ఆసుపత్రి సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.
తాజావార్తలు
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!