Sambhal Violence: పోలీసులకు మద్దతు ఇచ్చినందుకు.. భార్యకు ట్రిపుల్ తలాక్..
- సంభాల్ హింసలో పోలీసులకు ముస్లిం యువతి మద్దతు..
- పోలీసులకు సపోర్ట్ చేసినందుకు ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో ఇటీవల పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. సంభాల్లోని షాహీ జామా మసీదు సర్వేకి వచ్చిన అధికారులపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడి చేసింది, కొందరు గన్ ఫైర్ చేశారు. స్థానికంగా ఉన్న ఇళ్లను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ హింసపై మొత్తం 07 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. స్థానిక సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే కొడుకుపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఇదిల ఉంటే, నవంబర్ 24న జరిగిన హింసాకాండలో పోలీసులకు మద్దతుగా మాట్లాడినందుకు ఒక మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. హింస సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకునే హక్కు పోలీసులకు ఉందని మహిళ వాదించింది. దీంతో తన భర్త తనను ‘‘కాఫిర్(అవిశ్వాసకురాలు)’’ అని పిలిచినట్లు నిదా అనే మహిళ పేర్కొంది. ‘‘నేను ఒక పనిపై సంభాల్ వెళ్లే ముందు అక్కడి పరిస్థితి బాగానే ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంటర్నెట్కి వెళ్లి చూశానని, నా భర్త నన్ను వీడియోలు చూడనివ్వలేదు. ఘర్షణల తర్వాత పోలీసుల చర్యల్ని వ్యతిరేకిచాడు. పోలీసులు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని చెప్పినప్పుడు తనను తిట్టడం ఆరంభించినట్లు చెప్పారు’’ అని ఆమె చెప్పారు.
Also Read
- Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
Read Also: Aaditya Thackeray: సమాజ్వాదీ నేత ‘‘బీజేపీకి బీ-టీమ్’’..
అతను తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు ఆమె చెప్పింది. తన భర్త చిన్నచిన్న విషయాలపై తనతో వాగ్వాదానికి దిగుతున్నాడని, కుటుంబాన్ని చూసుకోవడం లేదని నిదా ఆరోపించారు. తనకు నలుగురు పిల్లలు ఉన్నారని, 5 నెలల చిన్న పిల్లకు బాగోలేదని, అతను చూసుకోవడం లేదని అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ట్రిపుల్ తలాక్తో పాటు కుమార్తెపై తన భర్త లైంగిక వేదింపులకు పాల్పడినట్లు నిదా లాయర్ ఆరోపించారు. కోర్టుని ఆశ్రయిస్తామని చెప్పారు. నిదా అత్తమామలు కూడా ట్రిపుల్ తలాక్కి మద్దతు ఇస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు.
నవంబర్ 24న సంభాల్లో మసీదు సమీపంలో ఘర్షణ జరిగింది. ఈ మసీదు ప్రాచీన హరిహర్ మందరిమని హిందూ పక్షం కోర్టుని ఆశ్రయించింది. మొఘల్ పాలకుడు బాబర్ సమయంలో ఈ ఆలయాన్ని కూల్చేసి, మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు మసీదు సర్వేకి ఆర్డర్ ఇచ్చింది. సర్వే జరుగే రోజు పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!