Sambhal Violence: పోలీసులకు మద్దతు ఇచ్చినందుకు.. భార్యకు ట్రిపుల్ తలాక్..
- సంభాల్ హింసలో పోలీసులకు ముస్లిం యువతి మద్దతు..
- పోలీసులకు సపోర్ట్ చేసినందుకు ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ పట్టణంలో ఇటీవల పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. సంభాల్లోని షాహీ జామా మసీదు సర్వేకి వచ్చిన అధికారులపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడి చేసింది, కొందరు గన్ ఫైర్ చేశారు. స్థానికంగా ఉన్న ఇళ్లను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ హింసపై మొత్తం 07 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. స్థానిక సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే కొడుకుపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఇదిల ఉంటే, నవంబర్ 24న జరిగిన హింసాకాండలో పోలీసులకు మద్దతుగా మాట్లాడినందుకు ఒక మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. హింస సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకునే హక్కు పోలీసులకు ఉందని మహిళ వాదించింది. దీంతో తన భర్త తనను ‘‘కాఫిర్(అవిశ్వాసకురాలు)’’ అని పిలిచినట్లు నిదా అనే మహిళ పేర్కొంది. ‘‘నేను ఒక పనిపై సంభాల్ వెళ్లే ముందు అక్కడి పరిస్థితి బాగానే ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంటర్నెట్కి వెళ్లి చూశానని, నా భర్త నన్ను వీడియోలు చూడనివ్వలేదు. ఘర్షణల తర్వాత పోలీసుల చర్యల్ని వ్యతిరేకిచాడు. పోలీసులు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని చెప్పినప్పుడు తనను తిట్టడం ఆరంభించినట్లు చెప్పారు’’ అని ఆమె చెప్పారు.
Also Read
Read Also: Aaditya Thackeray: సమాజ్వాదీ నేత ‘‘బీజేపీకి బీ-టీమ్’’..
అతను తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు ఆమె చెప్పింది. తన భర్త చిన్నచిన్న విషయాలపై తనతో వాగ్వాదానికి దిగుతున్నాడని, కుటుంబాన్ని చూసుకోవడం లేదని నిదా ఆరోపించారు. తనకు నలుగురు పిల్లలు ఉన్నారని, 5 నెలల చిన్న పిల్లకు బాగోలేదని, అతను చూసుకోవడం లేదని అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ట్రిపుల్ తలాక్తో పాటు కుమార్తెపై తన భర్త లైంగిక వేదింపులకు పాల్పడినట్లు నిదా లాయర్ ఆరోపించారు. కోర్టుని ఆశ్రయిస్తామని చెప్పారు. నిదా అత్తమామలు కూడా ట్రిపుల్ తలాక్కి మద్దతు ఇస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు.
నవంబర్ 24న సంభాల్లో మసీదు సమీపంలో ఘర్షణ జరిగింది. ఈ మసీదు ప్రాచీన హరిహర్ మందరిమని హిందూ పక్షం కోర్టుని ఆశ్రయించింది. మొఘల్ పాలకుడు బాబర్ సమయంలో ఈ ఆలయాన్ని కూల్చేసి, మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు మసీదు సర్వేకి ఆర్డర్ ఇచ్చింది. సర్వే జరుగే రోజు పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!