UP: సమాజ్వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
- దేశంలో కొనసాగుతోన్న రాజకీయ ఫిరాయింపులు
- సమాజ్వాదీ పార్టీలో రాజకీయ అలజడి
- కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
- యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. యూపీలో కూడా సమాజ్వాదీ పార్టీ నుంచి భారీ చీలిక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. మొత్తం ఎంపీలంతా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Also Read
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలిక తప్పదని.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే బీజేపీ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రపైనే దృష్టి పెట్టొద్దని.. ఇప్పుడు యూపీ వంతు వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఏఎన్ఐతో మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా కొనుగోలు కావడానికి సిద్ధంగా ఉంటేనే వారిని ఎవరైనా కొనుగోలు చేస్తారు. మహారాష్ట్ర గురించే కాకుండా ఉత్తరప్రదేశ్పై కూడా దృష్టి పెట్టండి’’ అని అన్నారు.
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్లో కొంతమంది ఎంపీలు తిరుగుబాటు చేశారనే వార్తలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన పలువురు ఎంపీలు ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య ఓపీ రాజ్భర్ చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అయితే సమాజ్వాదీ పార్టీ ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
समाजवादी पार्टी में बड़ी टूट होगी। राम गोपाल यादव ने केंद्रीय गृहमंत्री अमित शाह जी को चिट्ठी सौंपी है।
खनन घोटाला और गोमती रिवर फ्रंट घोटाला का मास्टरमाइंड कौन है, पूरा उत्तर प्रदेश जानता है। शिकंजा कस रहा है तो सपा परेशान है।
महाराष्ट्र बंगाल छोड़िए, समूची सपा, भाजपा में…
— Om Prakash Rajbhar (@oprajbhar) June 17, 2026
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!