Up Elections Polling: యూపీలో ఆఖరి విడత పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో ఆఖరి, చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడతలో 9 జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 613 అభ్యర్థులు పోటీలో వున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆఖరి విడతలో బీజేపీ, ఎస్పీ భాగస్వామ్య పక్షాల మధ్య పోటీ వుంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాల్లో 29 స్థానాల్లో విజయం సాధించింది.
ఉత్తర్ ప్రదేశ్ లో అజామ్ గడ్, మౌ, జాన్ పూర్, ఘాజీపూర్, చందోలి, వారణాసి, మీర్జాపూర్, భదోహి, సోన్ భద్ర జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. మూడు రోజుల పాటు వారణాసి లో ప్రచారం చేశారు ప్రధాని మోడీ. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తన భాగస్వామ్య పక్షమైన “రాష్ట్రీయ లోక్ దళ్” ( ఆర్.ఎల్.డి) అధినేత జయంత్ చౌధురి తో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తో కలిసి సంయుక్తంగా ర్యాలీ లు నిర్వహించారు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
పూర్వాంచల్ ప్రాంతంలో ప్రచారం చేశారు బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి. యూపీలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపచేసేందుకు విస్తృతంగా రోడ్ షో లతో పాటు, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూడా సందర్శించి, పూజలు చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె సోదరుడు రాహుల్ గాంధీ. 11 ఎస్.సి స్థానాలు, రెండు ఎస్.టి స్థానాలతో పాటు మొత్తం 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన భాగస్వామ్య పక్షాలైన అప్నా దళ్, ఎస్.బి.ఎస్.పి తో కలిసి 29 స్థానాల్లో గెలుపొందగా, సమాజ్ వాది పార్టీ 11 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీ 6 స్థానాల్లో గెలిచాయి. బీజేపీ భాగస్వామ్య పక్షాలు అప్నాదళ్ (సోనేలాల్), నిషాద్ పార్టీలకు సమాజ్ వాది పార్టీ భాగస్వామ్య పక్షాలైన అప్నాదళ్ (కమేరావాడి), సాహుల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ( ఎస్.బి.ఎస్.పి) లకు ఈ విడత ఎన్నికలు పెద్ద సవాల్ గా భావిస్తున్నారు.
మౌ సదర్ అసెంబ్లీ స్థానం నుంచి ముక్తార్ అన్సారీ కుమారుడు అబ్బాస్ అన్సారి పోటీలో వున్నారు. జహూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి సాహుల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్ భర్ పోటీ చేస్తున్నారు. ఈ విడతలో ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం, ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ప్రధాన మంత్రి మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోకసభ స్థానం పరిధిలో పోటీ లో ఉన్నారు ముగ్గురు రాష్ట్ర మంత్రులు.
దక్షిణ వారణాసి అసెంబ్లీ స్థానం నుంచి రాష్ట్ర పర్యాటక మంత్రి నీలకంఠ తివారీ, ఉత్తర వారణాసి అసెంబ్లీ స్థానం నుంచి జైస్వాల్ పోటీ చేస్తున్నారు. శివపూర్ అసెంబ్లీ స్థానం నుంచి అనిల్ రాజ్ భర్ పోటీలో వున్నారు. యోగి మంత్రివర్గం నుంచి వైదొలిగి, సమాజ్ వాది పార్టీ లో చేరిన దారా సింగ్ చౌహాన్ మౌ జిల్లాలోని ఘోసి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 10 వ తేదీ గురువారం, ఓట్ల లెక్కింపు జరగనుంది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..