UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన
- పర్యటనపై సరికొత్త ఊహాగానాలు
- షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ బీజేపీకి చాలా కీలకమైన రాష్ట్రాలు. దీంతో ఇప్పటి నుంచే ఆయా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇటీవల బీజేపీ కొత్త కూటమిని ప్రకటించాయి. ఈ కూటమి ఎన్నికల కోసమేనని వార్తలు వచ్చాయి. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం యూపీలో పర్యటిస్తున్నారు. లక్నోలో కీలక పర్యటన సాగుతోంది. ఇక మంగళవారం 500 మందికి పైగా బీఎల్ఓలతో జ్ఞానేష్ కుమార్ సమావేశం కానున్నారు. దీంతో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందే జరగవచ్చని తాజా పరిణామాలను బట్టి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read
- UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
- India’s Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణు వార్హెడ్లు? FAS నివేదికలో సంచలన వివరాలు
- CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్పై స్టాలిన్ విమర్శలు
- Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
వాస్తవానికి యూపీ అసెంబ్లీ పదవీ కాలం మే 22, 2027తో ముగుస్తుంది. దీంతో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా జ్ఞానేష్ కుమార్ ముందస్తు పర్యటన సరికొత్త ఊహాగానాలకు తెరలేపడమే కాకుండా కొత్త ఉత్సాహాన్ని రేకితిస్తోంది.
అయితే ఇది ఎన్నికల యంత్రాంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే సీఈసీ పర్యటిస్తున్నారని వర్గాలు చెబుతున్నారు. అంతేకాని ముంద్తు ఎన్నికలు నిర్వహించడం కోసం కాదని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడం కోసమే జ్ఞానేష్ కుమార్ పర్యటిస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల సంఘంలోని ఉన్నత వర్గాల సమాచారం మేరకు.. పాఠశాలలు, కళాశాలల ద్వారా యువతను ఓటర్ నమోదు చేయించుకునేందుకు ప్రోత్సహించడం అని చెబుతున్నారు. అలాగే ఓటింగ్ పట్ల వారిలో అవగాహన పెంచి.. తద్వారా సకాలంలో తమ ఓటరు గుర్తింపు కార్డులను పొందేలా చూడటం దీని లక్ష్యం అని అంటున్నారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్కు లక్కీ ఛాన్స్!
-
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?