UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
- వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్
- రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు
- బాలుడి మానసిక పరిస్థితిపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో ఓ ఆరేళ్ల చిన్నారి పరిస్థితి ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తల్లి క్యాన్సర్తో మృతి చెందడంతో కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఆ బాలుడు రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు వారంలో కొన్ని రోజులు తండ్రి వద్ద, మిగతా రోజులు అమ్మమ్మ-తాతల వద్ద గడపాల్సి వస్తుండటంతో.. అతని చదువు కూడా తీవ్రంగా దెబ్బతింటోంది.
బాలుడి సంరక్షణ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నెలకొనడంతో కోర్టు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం చిన్నారి వారంలో నాలుగు రోజులు తన అమ్మమ్మ, తాతల వద్ద ఉండగా.. మిగిలిన మూడు రోజులు తండ్రి వద్ద గడుపుతున్నాడు. దీంతో అతని జీవితం ప్రతి వారం రెండు ఇళ్ల మధ్యే సాగుతోంది. అయితే అసలు సమస్య చదువు విషయంలో తలెత్తింది. తండ్రి తన వద్ద ఉన్న ప్రాంతంలోని ఓ పాఠశాలలో బాలుడిని మొదటి తరగతిలో చేర్పించాడు. మరోవైపు అమ్మమ్మ, తాతలు తమ ప్రాంతంలోని మరో పాఠశాలలో ఎల్కేజీలో అడ్మిషన్ కల్పించారు. ఫలితంగా ఆ చిన్నారి వారంలో మూడు రోజులు ఒక స్కూల్లో ఎల్కేజీ తరగతులకు హాజరవుతుండగా.. మరో మూడు రోజులు మరో స్కూల్లో మొదటి తరగతి చదవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
- WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
- Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ఇరు ఇళ్ల మధ్య దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రయాణం కూడా బాలుడికి అదనపు భారంగా మారింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు సిలబస్లు, రెండు పాఠశాలల వాతావరణానికి అలవాటు పడాల్సి రావడంతో అతని మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరణం తర్వాత ప్రేమ, ఆప్యాయతతో ఎదగాల్సిన వయసులో ఈ చిన్నారి రెండు కుటుంబాల మధ్య జీవితం గడపాల్సి రావడం హృదయవిదారకంగా మారింది. బాలుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు పరస్పర అవగాహనతో వ్యవహరించాలని, అతని విద్యకు ఆటంకం కలగకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి శ్రేయస్సే ప్రధానంగా భావించి, అతని విద్య, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులు తగిన నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
తాజావార్తలు
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?