UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
- వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్
- రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు
- బాలుడి మానసిక పరిస్థితిపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో ఓ ఆరేళ్ల చిన్నారి పరిస్థితి ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తల్లి క్యాన్సర్తో మృతి చెందడంతో కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఆ బాలుడు రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు వారంలో కొన్ని రోజులు తండ్రి వద్ద, మిగతా రోజులు అమ్మమ్మ-తాతల వద్ద గడపాల్సి వస్తుండటంతో.. అతని చదువు కూడా తీవ్రంగా దెబ్బతింటోంది.
బాలుడి సంరక్షణ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నెలకొనడంతో కోర్టు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం చిన్నారి వారంలో నాలుగు రోజులు తన అమ్మమ్మ, తాతల వద్ద ఉండగా.. మిగిలిన మూడు రోజులు తండ్రి వద్ద గడుపుతున్నాడు. దీంతో అతని జీవితం ప్రతి వారం రెండు ఇళ్ల మధ్యే సాగుతోంది. అయితే అసలు సమస్య చదువు విషయంలో తలెత్తింది. తండ్రి తన వద్ద ఉన్న ప్రాంతంలోని ఓ పాఠశాలలో బాలుడిని మొదటి తరగతిలో చేర్పించాడు. మరోవైపు అమ్మమ్మ, తాతలు తమ ప్రాంతంలోని మరో పాఠశాలలో ఎల్కేజీలో అడ్మిషన్ కల్పించారు. ఫలితంగా ఆ చిన్నారి వారంలో మూడు రోజులు ఒక స్కూల్లో ఎల్కేజీ తరగతులకు హాజరవుతుండగా.. మరో మూడు రోజులు మరో స్కూల్లో మొదటి తరగతి చదవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ఇరు ఇళ్ల మధ్య దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రయాణం కూడా బాలుడికి అదనపు భారంగా మారింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు సిలబస్లు, రెండు పాఠశాలల వాతావరణానికి అలవాటు పడాల్సి రావడంతో అతని మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరణం తర్వాత ప్రేమ, ఆప్యాయతతో ఎదగాల్సిన వయసులో ఈ చిన్నారి రెండు కుటుంబాల మధ్య జీవితం గడపాల్సి రావడం హృదయవిదారకంగా మారింది. బాలుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు పరస్పర అవగాహనతో వ్యవహరించాలని, అతని విద్యకు ఆటంకం కలగకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి శ్రేయస్సే ప్రధానంగా భావించి, అతని విద్య, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులు తగిన నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!