Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran – Israel: మిడిల్ ఈస్ట్లో (మధ్యప్రాచ్యం) యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై మూడోసారి దాడి జరుగుతుందా? అనే కొత్త భయం ప్రపంచ దేశాలను వణికించేలా చేస్తోంది. గతంలో అమెరికా, ఇరాన్లోని మూడు అణు ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న రెండో విడత భీకర దాడులు జరిగాయి. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. ప్రస్తుతం అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో ఇరాన్లో శాంతి నెలకొన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల మూడో రౌండ్ విధ్వంసానికి స్క్రిప్ట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నెతన్యాహు ‘సిక్రెట్ ప్లాన్’..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా చేసిన ప్రకటన ఇరాన్లో మళ్లీ వణుకు పుట్టిస్తోంది. “మా సైన్యం ఇప్పటికే రెండుసార్లు ఇరాన్లోకి దూసుకెళ్లి దాడులు చేసింది. అవసరమైతే మూడోసారి కూడా దాడి చేయడానికి వెనుకాడం. నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ చేతికి అణు ఆయుధాలు రానివ్వను” అని నెతన్యాహు ఘాటుగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా ఇరాన్పై మూడో దాడి తప్పదనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్కు వ్యతిరేకంగా ఒక పెద్ద సైనిక ఆపరేషన్కు రెడీ అవుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ నివేదికలో వెల్లడించింది. ఒకవేళ ఇరాన్ కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, టెహ్రాన్పై మళ్లీ బాంబుల వర్షం కురిపించాలని టాప్ అఫీషియల్స్తో ట్రంప్ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో ఇరాన్తో అణు కార్యక్రమంపై చర్చలు జరపడానికి కూడా ట్రంప్ అనుమతించారు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ఆ రెండు అంశాలు..
‘హోర్ముజ్ జలసంధి’ పూర్తిగా తెరవకపోవడం, అలాగే అణు కార్యక్రమంపై అమెరికా షరతులకు ఇరాన్ లొంగకపోవడం అనే రెండు వివాదాలు అమెరికా-ఇరాన్ మధ్య వివాదానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇవే మళ్లీ యుద్ధానికి ట్రిగ్గర్ పాయింట్లుగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికాల హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘిర్ ఖలీబాఫ్ స్పందిస్తూ.. “మేము శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ అవి విఫలమైతే యుద్ధానికి మేము కూడా సిద్ధమే” అని తేల్చి చెప్పారు. ఒకవేళ ఇరాన్పై మూడోసారి దాడి జరిగితే ఆ సెగ ప్రపంచం మొత్తానికి తగలనుంది. ప్రస్తుతం బ్యారెల్కు 72 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర ఏకంగా 150 డాలర్లకు చేరుకుంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇదే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోవడంతో పాటు ‘మహా ద్రవ్యోల్బణం’ రావడం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!