ఇంటర్వ్యూ కి పిలిచి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఫతేనగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫతేనగర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి ఓ యువతి ఈనెల 21న వెళ్లింది. ఆమెకు నెలకు రూ.22 వేల జీతం ఇస్తానని, ఫోన్ కాల్స్ అటెండ్ చేయాలని, విజిటర్లతో మాట్లాడాలని స్కూల్ కరెస్పాండెంట్ చెప్పాడు. తన పీఏగా కూడా ఉండాలని…
ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. నేపాల్ కి చెందిన బాలిక జూబ్లీహిల్స్ లో తల్లితండ్రితో కలిసి నివాసం ఉంటోంది. బాలిక కి తన ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు కృష్ణ తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో బాలిక ను ట్రాప్ చేశాడు కృష్ణ.. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో ఇంట్లో నుంచి బాలిక వచ్చేసింది. Also Read:Gold Price Today:…
GHMC Mayor: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఫోన్లో వేధింపులు. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ ఓ ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడుడుతున్నాడు. మేయర్ తో పాటు ఆమె తండ్రి కే కేశవరావు అంతు చూస్తానంటూ బెదిరింపులు దిగుతున్నాడు.
కామాంధులు, పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కఠిన చట్టాలు అమలవుతున్నప్పటికీ మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగుచూసింది. బరితెగించిన కామాంధులు భర్త కళ్లెదుటే భార్యను వేధించారు. అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో ఆకతాయిలు బెదిరింపులకు పాల్పడ్డారు. Also Read:Virat Kohli: అన్ని ఆలోచించాకే రిటైర్మెంట్ ప్రకటించా.. కోహ్లీ…
దేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువైపోతున్నాయి. మహిళా రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొన్ని రోజుల క్రితం పూణేలో ఆగి ఉన్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్రలో కేంద్ర మంత్రి కుమార్తెను కొందరు ఆకతాయిలు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహాశివరాత్రి జాతరలో తన కుమార్తెను కొంత మంది యువకులు వేధించారని ఆరోపిస్తూ పోలీసులకు…
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై కేజ్రీవాల్ సతీమణి సునీతా తీవ్ర ఆరోపణలు చేశారు. కస్టడీలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ను వేధిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తీవ్రంగా వేధిస్తున్నారంటూ మీడియాకు తెలియజేశారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళను వెంటపడి వేధిస్తున్నాడు ఓ యువకుడు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో.. యువతితో పెళ్లి అయినట్లు సర్టిఫికేట్ తయారు చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేసారు.
మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. అలాగే మహిళా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వేధింపులు తప్పడం లేదు.