Piyush Goyal: రాజ్యసభకు నాయకుడిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మళ్లీ నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో సభా నాయకుడిగా తిరిగి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు సమాచారం పంపారు. నిబంధనలకు అనుగుణంగా ప్రధాని పీయూష్ గోయల్ను రాజ్యసభలో సభా నాయకుడిగా నియమించారు. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ గోయల్ను రాజ్యసభ నాయకుడిగా నియమించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్తో ఆయన రాజ్యసభ ఎంపీ పదవీకాలం ముగిసింది. జులై 8న రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 27 మంది సభ్యులలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఉన్నారు. గోయల్ మహారాష్ట్ర రాష్ట్రం నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అందువల్ల ఆయన మళ్లీ రాజ్యసభ నాయకుడిగా నియమించబడ్డారు.
తన 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో, గోయల్ ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో వివిధ స్థాయిలలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా ఉన్నారు. ఆయన పార్టీ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. 2019 సాధారణ ఎన్నికలలో ఆయన మేనిఫెస్టో, ప్రచార కమిటీలలో సభ్యుడు. 2014 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సమాచార ప్రసార కమిటీకి కూడా ఆయన నేతృత్వం వహించారు.
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
Donations: రాజకీయ పార్టీలనూ తాకిన కొవిడ్ దెబ్బ.. 41.49శాతం తగ్గిన విరాళాలు
వృత్తిరీత్యా ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన పీయూష్ గోయల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో పని చేశారు. అతని తండ్రి, దివంగత వేదప్రకాష్ గోయల్ కేంద్ర షిప్పింగ్ మంత్రిగా, రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. అతని తల్లి చంద్రకాంత గోయల్ ముంబై నుండి మహారాష్ట్ర శాసనసభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన చురుకైన సామాజిక కార్యకర్త అయిన సీమను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధృవ్, రాధిక, ఇద్దరూ USAలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు.
తాజావార్తలు
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!