యూపీలో రాజీనామాలు పెద్ద విషయం కాదు.. కొట్టిపారేసిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. మూడు రోజుల్లోనే ఏకంగా ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. బీజేపీ కూటమి నుంచి 11 మంది ఎమ్మెల్యేలు వైదొలగగా… ఇక, బీజేపీకి చెందినవారే యోగి ఆదిత్యానాథ్ కేబినెట్ నుంచి ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. ఈ పరిణామాలన్నీ ప్రతిపక్ష సమాజ్వాది పార్టీకి కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఈ ప్రభుత్వం అబద్దాలకోరు.. ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని అంతా ఆరోపిస్తున్నారు. తాజా పరిస్థితులపై స్పందించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. చాలా లైట్గా తీసుకున్నారు.
Read Also: తెలంగాణలో లాక్డౌన్..? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
ఉత్తరప్రదేశ్లో మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాలు పెద్ద విషయం కాదు అన్నారు నరేంద్ర సింగ్ తోమర్… రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి బీజేపీకి మద్దతు లభిస్తోందన్న ఆయన.. ప్రజలు మమ్మల్ని మరోసారి ఆశీర్వదిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో బీజేపీ విజయం సాధిస్తుంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర సింగ్ తోమర్. కాగా, మంగళవారం నుంచి ముగ్గురు మంత్రులతో సహా పది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.. మంత్రిగా ఉన్న మౌర్య నిష్క్రమణతో ఇది ప్రారంభమైంది. అదే రోజున ఆయనకు సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలు – భగవతి సాగర్, రౌషన్ లాల్ వర్మ మరియు బ్రిజేష్ ప్రజాపతి బీజేపీని వీడగా.. మొన్న మరో మంత్రి దారా సింగ్ చౌహాన్, ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా రాజీనామా చేశారు. ఇక, నిన్న మంత్రి ధరమ్ సింగ్ సైనీ, మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు – వినయ్ షాక్యా, ముఖేష్ వర్మ మరియు బాలా అవస్తి కూడా పార్టీని వీడారు. బీజేపీకి గుడ్బై చెప్పిన ముగ్గురు మంత్రులూ కీలకమైన ఓబీసీ వర్గాలకు చెందిన నేతలు.. యోగి సర్కార్ వెనుకబడిన తరగతులను విస్మరించిందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!