Ashwini Vaishnaw: వృద్ధులకు రైల్వే మంత్రి షాక్.. రాయితీలేనట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Ashwini Vaishnaw on concessions in Railways: రైళ్లలో వయోవృద్ధులకు ఇచ్చే రాయితీలై కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్. వయో వృద్ధులకు ఇచ్చే రాయితలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. రైల్వేలో ఫించన్లు, ఉద్యోగులు జీతాల భారం అధికంగా ఉందని.. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు రాయితీను పునరుద్ధరించడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన పార్లమెంట్ లో వెల్లడించారు. కరోనా సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజెన్ల రాయితీని ఎప్పుడు మళ్లీ ప్రారంభిస్తారని అమరావతి ఎంపీ నవనీత్ రాణా బుధవారం లోక్ సభలో ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెబుతూ అశ్విణి వైష్ణవ్ రాయితీలపై మాట్లాడారు.
Read Also: Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేస్.. నవీన్ రెడ్డితో సహా 14మందికి రిమాండ్
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ప్రయాణికుల సేవల కోసం గతేడాది ప్రభుత్వం రూ. 59 వేల కోట్లను ఖర్చు పెట్టినట్లు ఆయన వెల్లడిచారు. ఇది కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువని ఆయన అన్నారు. రైల్వేలో ఏడాదికి పించన్ల కోసం రూ. 60 వేల కోట్లు, వేతనాల కోసం రూ. 97వేల కోట్లు, ఇంధనం కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో రైల్వేలో కొత్త సదుపాయాలను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే రైల్వేలో రాయితీని పరిశీలిస్తామని అన్నారు. ప్రస్తుతానికి అయితే రైల్వేలో రాయితీలను పునరుద్ధరించే అవకాశం లేదని.. రైల్వేల పరిస్థితిని కూడా చూసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను 500-550 కిలోమీటర్ల వరకు నడిపిస్తున్నామని.. స్లీపర్ సదుపాయం అందుబాటులోకి వస్తే మరింత దూరం నడిపిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!