Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేస్.. నవీన్ రెడ్డితో సహా 14మందికి రిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaishali Kidnap Case: భాగ్యనగరంలో సంచలనం రేకెత్తించిన దంత వైద్య విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి సహా ఆరుగురు నిందితులకు ఇబ్రమీంపట్నం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే నవీన్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే సమయంలో 58 నిమిషాల వీడియో విడుదల చేస్తే.. అందులో రెండు నిమిషాలే పోలీసులు మీడియాకు విడుదల చేశారని నవీన్ రెడ్డి ఆరోపించాడు. భయం వేస్తోందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. గతంలో నవీన్ రెడ్డిపై వరంగల్, విశాఖపట్నం, ఆదిభట్లలో నమోదైన వాటితో కలిపి 4 కేసులు ఉన్నట్లు
తెలిపిన పోలీసులు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే.. పరారీలో ఉన్న రుమన్, పవన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు పోలీసులు వివరించారు.
Read also: S Jaishankar: ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? పాక్ తీరుపై నిప్పులు
Also Read
ఈనేపథ్యంలో మంగళవారం సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల ద్వారా మీడియాకు చేరవేశాడు నవీన్ రెడ్డి. తనే, బాధితుడినంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఈవీడియో సంచలనంగా మారింది. ఇక, 6 రోజులుగా ఇతడి ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గోవాలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దవున్న ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, రాత్రి ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు.
అసలు ఏం జరిగింది
తాను ఇష్టపడిన హైదరాబాద్ మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలు వైశాలిని తను దక్కించుకోవాలని అనుకున్నాడు. వైశాలికి ఎన్ఆర్ఐ సంబంధం రావాడంతో ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. దీనికి పక్కప్లాన్ వేసిన నవీన్ రెడ్డి తన అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 50 మందిని అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బలవంతంగా అపహరించి తీసుకెళ్లాడు. వైశాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసమాచారం నవీన్ రెడ్డికి తెలియడంతో.. మిత్రుల సహకారంతో యువతిని సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో..మరుసటి రోజు 32 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే..ఈ నెల 11న శంషాబాద్ పరిసరాల్లో నిందితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, చందు, ప్రవీణ్, ప్రకాష్, మహేశ్, యశ్వంత్ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని జప్తు చేశారు.
Astrology: డిసెంబర్ 15, గురువారం దినఫలాలు
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!