Union Budget 2026: కేంద్ర బడ్జెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI), డిజిటల్ మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్టార్టప్లు, ఇన్నోవేషన్కు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వానికి కీలకమని మోడీ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అలాగే, దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం పెట్టుబడుల ప్రోత్సాహక విధానాలను ముందుకు తీసుకొచ్చింది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం ద్వారా పరిశ్రమలు, సేవా రంగంలో వేగవంతమైన అభివృద్ధిని సాధించాలన్నది మోడీ ప్రభుత్వం ఆలోచనగా పెట్టుకుంది.
Read Also: Bandla Ganesh : “ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర!”.. బండ్లన్న భక్తికి శివాజీ ఫిదా!
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం:
బడ్జెట్ లో మహిళా వ్యాపారులను ప్రోత్సహించేలా ప్రత్యేక రాయితీలు, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. అలాగే, యువతలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కొత్త కార్యక్రమాలు, శిక్షణా పథకాలను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణ బడ్జెట్లో ప్రధానంగా చర్చకు వచ్చాయి. వివిధ రంగాల్లో స్థిరమైన ఉపాధిని సృష్టించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది.
Read Also: Venkatesh Remuneration: ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్.. వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్?
వ్యవసాయం, రైతులకు సాయం:
వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజీలను కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించింది. రైతుల ఆదాయం పెంచే చర్యలు, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఔషధ, ఆరోగ్య రంగాల బలోపేతం:
చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు ఫార్మాస్యూటికల్ రంగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, జీవనోపాధి, ఆర్థిక అవకాశాల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది.