Samajwadi Party: కాంగ్రెస్కి అఖిలేష్ యాదవ్ షాక్.. ఉప ఎన్నికల్లో సీట్ల షేరింగ్కి ‘నో’..
- హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్కి వరస షాక్లు..
- సీట్ల షేరింగ్కి ‘నో’ చెప్పిన అఖిలేష్ యాదవ్ పార్టీ..
- ఈ ఏడాది చివర్లో యూపీలో బై-ఎలక్షన్స్..
Samajwadi Party: హర్యానా ఎన్నికల ఓటమి కాంగ్రెస్ పార్టీపై బాగానే కనిపిస్తోంది. ఇండియా కూటమిలో మిత్రపక్షాలైన శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, సమాజ్వాదీ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై సమీక్ష చేసుకోవాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు. ఖచ్చితంగా గెలుస్తుందని భావించిన కాంగ్రెస్ బొక్కబోర్లా పడటంతో పలు పార్టీలు ఆ పార్టీతో పొత్తుపై పునరాలోచిస్తున్నాయి. ఈ ప్రభావం వచ్చే మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో పడబోతోంది.
ఇదిలా ఉంటే, ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న అఖిలేష్ యాదవ్కి చెందిన సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కాంగ్రెస్కి భారీ షాక్ ఇచ్చింది. త్వరలో ఉత్తర్ ప్రదేశ్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీట్ల షేరింగ్ అభ్యర్థనను ఎస్పీ తిరస్కరించింది. ఈ ఏడాది చివర్లలో 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాబోయే ఎన్నికల్లో 10లో 5 ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. అయితే, ఏప్రిల్-జూన్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రదర్శనను చూపెడుతూ.. ఆ పార్టీ ప్రపోజల్ని ఎస్పీ తిరస్కరించింది.
Also Read
Read Also: Honor Tablet GT Pro: హానర్ నుంచి కొత్త ట్యాబ్.. డిజైన్, ఫీచర్లు ఇవే
త్వరలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గానూ 06 స్థానాలకు ఎస్పీ తన అభ్యర్థుల్ని బుధవారం ప్రకటించింది. కర్హల్ నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ను, సిసాము స్థానం నుండి నసీమ్ సోలంకి, ఫుల్పూర్ (ప్రయాగ్రాజ్) నుండి ముస్తఫా సిద్దిఖీ , మిల్కిపూర్ (అయోధ్య) నుండి అజిత్ ప్రసాద్లకు టికెట్ ఇచ్చింది. కతేహరి, మజ్వాన్ స్థానాల నుంచి శోభావాయ్ వర్మ, జ్యోతి బింద్లకు పార్టీ బరిలోకి దింపింది. ఎస్పీ నేత రవిదాస్ మెహ్రోత్రా.. హర్యానాలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడానికి ప్రస్తావించారు. వారు సమాజ్వాదీ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, మొత్తం రాష్ట్రాన్ని బీజేపీ ఇచ్చారని అన్నారు.
సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఈ రోజు హర్యానాలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేదని ఆయన అన్నారు. యూపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని భావిస్తున్నామని, అందుకే ఆరుగురు అభ్యర్థుల్ని ప్రకటించినట్లు రవిదాస్ చెప్పారు. మిగిలిన 4 స్థానాల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని తమ పార్టీ భావిస్తోందని చెప్పారు. తమను సంప్రదించకుండా ఎస్పీ అభ్యర్థుల్ని ప్రకటించడంపై యూపీ కాంగ్రెస్ ఇంచార్జ్ అవినాష్ పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!