Bangladesh: బంగ్లాదేశ్లో ఉగ్రదాడులకు అవకాశం.. తమ పౌరులకు యూకే జాగ్రత్త..
- బంగ్లాదేశ్ వెళ్లే వారు జాగ్రత్త..
- ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది..
- తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన యూకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని యూకే హెచ్చరించింది. తమ పౌరులు ఆ దేశానికి ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘‘రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు వంటి వాటిలో పాటు విదేశీ పౌరులు సందర్శించే ప్రదేశాలతో సహా తీవ్రవాద దాడులు విచక్షణారహితంగా జరగవచ్చు’’ అని యూకే తెలిపింది.
బంగ్లాదేశ్లో ఇటీవల కాలంలో మైనారిటీలపై , ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్పై ఆ దేశం దేశద్రోహ కేసు పెట్టి, అరెస్ట్ చేసింది. అతడికి బెయిల్ కూడా మంజూరు చేయలేదు. ఆయన తరపు వాదించే లాయర్లపై మతోన్మాదులు దాడికి తెగబడుతున్నారు. తాజాగా ఆయన తరుఫు వాదించే ఓ హిందూ లాయర్పై దాడి చేయడంతో ఆయన చావుబతుకుల మధ్య ఉన్నాడు. మరోవైపు చిట్టగాంగ్ బార్ అసోసియేషన్లో ముస్లిం న్యాయవాదులు, హిందూ న్యాయవాదుల్ని బెదిరిస్తున్నారు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: Dulkar Salman : మళ్లీ తెలుగోడి డైరెక్షన్లోనే.. దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ
ఈ నేపథ్యంలోనే యూకే తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ‘‘కొన్ని సమూహాలు ఇస్లాంకు విరుద్ధమైన అభిప్రాయాలు, జీవనశైలి కలిగిన వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో ఐఈడీ దాడులు ఉన్నాయి. బంగ్లాదేశ్ అధికారులు ప్లాన్డ్ అటాక్స్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’అని యూకే అడ్వైజరీలో చెప్పింది.
బంగ్లాదేశ్ హిందూ వ్యతిరేక హింసపై యూకే ఆందోళన వ్యక్తం చేసింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఎంపీ మంగళవారం హౌజ్ ఆఫ్ కామన్స్లో చెప్పారు. ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. “ప్రసిద్ధ హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్ను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేసిన తర్వాత భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన విషయం మాకు తెలుసు. UK ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (FCDO) డెస్క్ ఆ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది” అని ఎంపీ కేథరీన్ వెస్ట్ చెప్పారు.
తాజావార్తలు
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..