Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉజ్వల్ నికమ్.
- ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ఆదేశాలు.
- నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal murder case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది, ముంబై దాడుల కేసులో ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష పడేలా వాదించిన ఉజ్వల్ నికమ్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం నియమించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధితు కుటుంబానికి ఈ హామీ ఇచ్చారు. శుక్రవారం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ సీఎంను కలిసి తన కుమారుడికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఫడ్నవీస్ హామీ ఇచ్చారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన ఉజ్వల్ నికమ్ను నియమించాలని కుటుంబం చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఈకేసు వాదించడానికి ఉజ్వల్ నికమ్ కూడా అంగీకరించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. దీంతో పాటు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయ, శాసన శాఖ కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, కేతన్ను లోహ్గఢ్ కోట పైనుంచి లోయలోకి తోసి చంపేశారు. ఈ ఘటనను ముందుగా ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, చివరకు కేతన్ కుటుంబ సభ్యుల అనుమానాలతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. జూన్ 14న లోహ్గఢ్ కోటకు తీసుకెళ్లి కేతన్ను చంపేందుకు విఫలయత్నం చేసింది. ప్లాన్ విఫలం కావడంతో జూన్ 18న మరోసారి అదే ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసినట్లు తేలింది.
తాజావార్తలు
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!