Wayanad: వయనాడ్లో ప్రియాంక గాంధీకి మద్దతుగా యూడీఎఫ్ ఎన్నికల ప్రచారం..
- కేరళలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్..
- నేడు లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యూడీఎఫ్ సమావేశాలు..
- ప్రియాంక గాంధీ గెలుపే లక్ష్యంగా పని చేయనున్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చే నెలలో జరగనున్న వయనాడ్ ఉప ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ కోసం అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వయనాడ్ లోక్సభ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు (శనివారం) యూడీఎఫ్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు కే. సుధాకరన్, కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్, యూడీఎఫ్ కన్వీనర్ ఎంఎం హసన్, ఐయుఎంఎల్ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి సహా ప్రముఖ నేతలు పాల్గొంటారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
అయితే, అక్టోబర్ 25 నాటికి అన్ని పంచాయతీ ఎన్నికల కమిటీలు, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్- యూడీఎఫ్ నేతలు భావిస్తున్నారు. అగ్ర నేతల నేతృత్వంలో ఈ నెల 26, 27 తేదీల్లో ఇంటింటి ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే, నియోజకవర్గ ఎన్నికల కమిటీలను సైతం ఏర్పాటు చేయనున్నారు. సుల్తాన్ బతేరి నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకుడు డీన్ కురియాకోస్ నేతృత్వంలో పంచాయతీ సమావేశాలు కంప్లీట్ అయింది. రానున్న రోజుల్లో కల్పేటలో ఎమ్మెల్యే సన్నీ జోసెఫ్, ఎంపీ రాజ్మోహన్ ఉన్నితన్ నేతృత్వంలో మనంతవాడి పంచాయతీలో కమిటీలు వేసేందుకు సమావేశం కానున్నారు.
Read Also: Bomb Threat: మరోసారి ఢిల్లీ-లండన్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..
ఇక, రాహుల్ గాంధీకి మద్దతు పలికిన వయనాడ్ ప్రజలు మరోసారి ప్రియాంక గాంధీకి చారిత్రాత్మక మెజారిటీ ఇవ్వడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక, భారత ఎన్నికల సంఘం ఇటీవల 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. వయనాడ్ లోక్సభ స్థానానికి నవంబర్ 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!