Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రే శివాజీ పేరు చెప్పుకుంటూ ఔరంగజేబులా ప్రవర్తిస్తున్నాడు..
- శివాజీ విగ్రహం చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు..
- విగ్రహం కూలిపోవడంపై బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు..
- ఉద్ధవ్ ఠాక్రే..కాంగ్రెస్పై ఎదురుదాడి ప్రారంభించిన సీఎం ఏక్నాథ్ షిండే..
- ఠాక్రే శివాజీ పేరు చెప్పుకుంటూ ఔరంగజేబు మార్గంలో వెళ్తున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార ఏక్నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు గుప్పిస్తోంది. ఈ రోజు విగ్రహం కూలిపోయిన ఘటనకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు చేస్తు్న్న ఆందోళనలపై ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఫైర్ అవుతోంది. దీనిని రాజకీయం చేయడం మానుకోవాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
ఇదిలా ఉంటే, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రేపై, సీఎం ఏక్నాథ్ షిండే విరుచుకుపడ్డారు. ఠాక్రే ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరుతో రాజకీయాలు చేస్తూ ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్ మార్గంలో నడుస్తున్నాడని షిండే విమర్శించారు. రెండేళ్ల కిందట మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేని బయటకు గెంటేశారని దుయ్యబట్టారు. ఠాక్రే శివాజీ పేరుతో బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చి ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Chandrababu- Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్..
విపక్షాలు ఈ అంశంపై రాజకీయం చేయడం బాధాకరమని చెప్పారు. శివాజీ మాకు రాజకీయ అంశం కాదు, ఆయన మాకు గుర్తింపు, మా విశ్వాసం అని చెప్పారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని చెప్పారు. ‘‘కర్ణాటకలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పగలగొట్టేందుకు రెండు జేసీబీలు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని కూల్చివేశారు.. ఇలా చేసిన వారిని కొట్టాలి. ఇది చేయకుండా, వారు (కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే) ఇక్కడ నిరసనలు చేస్తున్నారు, కానీ మహారాష్ట్ర ప్రజలు తెలివైనవారు, వారు దీనిని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బూట్లతో కొడతారు’’ అని పరోక్షంగా కాంగ్రెస్ని షిండే విమర్శించారు.
ఆగస్టు 26న సింధుదుర్గ్ జిల్లాలోని శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంతో ఈ అంశం రాజకీయంగా మారింది. కొద్ది నెలల క్రితమే ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోయిన అంశంపై ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!