Uddhav Thackeray: రాజకీయాలు “ఐపీఎల్”లాగా మారాయి..ఎవరు ఏ వైపు ఆడుతున్నారో ఎవరికీ తెలియదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: భారతదేశంలో రాజకీయాలు ఇప్పుడు ఐపీఎల్ లాగా మారాయి..ఎవరు ఏ వైపు ఆడుతున్నారో ఎవరికీ తెలియడం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ రోజు బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో, మహారాష్ట్రలో రాజకీయాలు అధ్వాన్నంగా మారాయి.. ప్రజలు కలత చెందుతున్నారు, ప్రభుత్వం ఇప్పటికీ ప్రజల్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
Read Also: Aishwarya Rajinikanth: ఆ హీరోతో ప్రేమలో పడ్డ రజనీకాంత్ కూతురు.. మళ్ళీ పెళ్ళికి రెడీ?
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
బీజేపీ నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉద్దేశిస్తూ.. తాను ఎప్పుడూ ఎన్సీపీతో పొత్తు పెట్టుకోనని ఫడ్నవీస్ గతంలో అన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు ఠాక్రే. ఎన్సీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానన్ని కళంకం అని గతంలో వ్యాఖ్యానించిన ఫడ్నవీస్ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడని విమర్శించారు. ఇటీవల ఎన్సీపీలో చీలక విషయాన్ని గురించి ప్రస్తావించారు.
గతేడాది ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగబాటు చేయడంతో మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం పడిపోయింది. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఆయన సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్సీపీ నేత అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు షాక్ ఇచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేలతో ఎన్సీపీ బీజేపీ-షిండే ప్రభుత్వంలో చేరింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇలా రెండేళ్లలో మహారాష్ట్రలో ప్రధాన పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలు బీజేపీతో జతకట్టాయి.
తాజావార్తలు
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..