Kerala: ఇన్సూరెన్స్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
- కేరళలోని తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం
- ఇన్సూరెన్స్ కార్యాలయంలో ఇద్దరు సజీవదహనం
కేరళలోని తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పప్పనంకోడ్లోని ఇన్సూరెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఇద్దరు మహిళలు చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Viral Video: అభిమానికి పెద్ద గిఫ్ట్ ఇచ్చిన లులూ గ్రూప్ యజమాని.. వీడియో వైరల్
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
పాపనంకోడ్ జంక్షన్ సమీపంలోని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఏజెన్సీ కార్యాలయంలో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకరిని ఏజెన్సీ ఉద్యోగి వైష్ణవి (35)గా గుర్తించగా.. మరో మహిళ ఆచూకీ తెలియలేదు. రెండు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, అగ్నిమాపక సిబ్బంది భవనంపై నుంచి బయటకు తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు.
ఇది కూడా చదవండి: UP: లక్నోలో దారుణం.. కదులుతున్న కారులో మోడల్పై గ్యాంగ్రేప్
మంటలు చెలరేగకముందే పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు సమాచారం అందించారు. అలాగే సమీపంలోని దుకాణ యజమానులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ కార్యాలయం పూర్తిగా దెబ్బతింది. కార్యాలయం లోపల నుంచి రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
అగ్నిమాపక శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మొత్తం విషయాలు వెల్లడవుతాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: CS Shanti Kumari: ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలి..
తాజావార్తలు
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో