Twitter: భారత్లో కొత్తగా ట్విట్టర్ “అఫిషియల్ టిక్” ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter ‘Official’ Tick Starts Appearing on Verified Accounts in India: ట్విట్టర్ ని హస్తగతం చేసుకున్న తర్వాత కొత్త బాస్ ఎలాన్ మస్క్ పూర్తిగా ప్రక్షాళన చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ చివరి వారంలో 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్ తో పాటు పాలసీ చీఫ్ విజయగద్దెలతో పాటు పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు 50 శాతం మంది ఉద్యోగులు అంటే 3700 మందిని తొలగిస్తూ గత శుక్రవారం నుంచి ప్రక్రియ ప్రారంభించారు. భారత్ లోని 200 మంది ఉద్యోగులను తొలగించాడు మస్క్. దీంతో పాటు బ్లూటిక్ ఉంటే వెరిఫైడ్ ఖాతాలకు నెలకు 8 డాలర్ల(సుమారు రూ. 650)ను వసూలు చేస్తున్నట్లు ఇప్పటికే మస్క్ స్పష్టం చేశారు.
Read Also: IT Industry: ఐటీలో కోటి కష్టాలు.. రానున్నది గడ్డుకాలమేనా..?
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
ఇదిలా ఉంటే తాజాగా బుధవారం నుంచి భారత్ లోని పలువురు వెరిఫైడ్ ట్విట్టర్ ఖాతాల బ్యాడ్జింగ్ మారింది. కొత్తగా ‘‘ అఫిషియల్’’ పదంతో కూడిన బ్లూటిక్ బ్యాడ్జింగ్ ప్రారంభం అయింది. నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాతో పాటు దేశంలోని ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లో ట్విట్టర్ బ్యాడ్జింగ్ మారింది. హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మరికొందరు మంత్రుల ట్విట్టర్ హ్యాండిల్స్లో కూడా ఇదే లేబుల్ కనిపించింది.
ఇప్పుడు వెరిఫైడ్ ఖాతాలు ఉన్నవారు ట్విట్టర్ బ్లూకు సబ్స్క్రైబ్ పొందాలని కంపెనీ సూచిస్తోంది.నవంబర్ నెలాఖరు వరకు ఇండియాలో కూడా వెరిఫైడ్ ఖాతాల నుంచి నెలకు రూ. 650 వరకు వసూలు చేయాలని ట్విట్టర్ భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని మస్క్ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇండియన్ నెటిజన్ భారతదేశంలో ట్విట్టర్ బ్లూ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయని ప్రశ్నించగా.. నెలలోపు అంటూ మస్క్ సమాధానం ఇచ్చారు. అయితే కొనుగోలు శక్తి ఆధారంగా నెల ధరను నిర్ణయిస్తామని మస్క్ స్పష్టం చేశారు. ట్విట్టర్ బ్లూ సభ్యత్వం ఉన్నవారికి మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయిని ట్విట్టర్ తెలుపుతోంది.
తాజావార్తలు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!